Nizamabad Mlas Headache : తల పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నారు అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు. అనుచరుడు ఏకు మేకై వ్యవహారాలు నడపటంతో తలపట్టుకున్నారట. తాజా ఘటనలో అధిష్ఠానానికి MLAలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ పెరుగుతోందట.
ఎమ్మెల్యేలకు మింగుడు పడని మేయర్ భర్త తీరు
నిజామాబాద్ నగరంలోని సాయినగర్లో 300 గజాల స్థలం టీఆర్ఎస్లో చిచ్చు రాజేసింది. విలువైన ఈ స్థలం కోసం అధికారపార్టీ నేతలు వీధిపోరాటానికి దిగడం.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. అనుచరుడు కదా అని అందలం ఎక్కిస్తే.. ప్రజల్లో పరువు తీస్తున్నాడని మేయర్ భర్త తీరుపై లబోదిబోమంటున్నారట ఎమ్మెల్యేలు. ఈ ఘటనలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్ గుప్తలకు మేయర్ దండు నీతు భర్త శేఖర్ తీరు మింగుడుపడటం లేదట.
Also Read
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
- OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
- Off The Record: ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ నేతలు వెళ్తారా..? తెలుగు తమ్ముళ్లలో కొత్త టెన్షన్
- OTR : తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీకి ఢిల్లీ పిలుపు..రేవంత్ టీమ్లో హైటెన్షన్ ఎందుకు?
నష్ట నివారణ చర్యల్లో ఎమ్మెల్యేలు
ఆ మధ్య నిజామబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చినప్పుడు.. భూ వివాదాల విషయంలో మేయర్ భర్తను గట్టిగానే హెచ్చరించారు. కానీ శేఖర్ తీరు మారక.. ఇప్పుడు రోడ్డెక్కడంతో అది ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియక కలవర పడుతున్నారట ఎమ్మెల్యేలు. పైగా ఈ వివవాదంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి అల్లుడు సంపత్ పేరు ప్రస్తావనకు రావడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
సీనియర్ల మధ్య వివాదాలు తలెత్తకుండా అలర్ట్
వివాదానికి కారణమైన వ్యక్తులను కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితులు తెలుసుకొనే ప్రయత్నం చేశారట ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గణేష్గుప్తా. చివరకు దండు శేఖర్పై అసహనం వ్యక్తం చేసి.. దూకుడు తగ్గించాలని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సమస్య రోడ్డెక్కి రచ్చ కావడంతో విషయాన్ని టీఆర్ఎస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట ఎమ్మెల్యేలు. గతంలోనే ఎమ్మెల్సీ కవిత హెచ్చరించి ఉండటంతో.. తాజా రగడ పార్టీ సీనియర్ల మధ్య కొత్త వివాదాలు తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నారట.
టీఆర్ఎస్పై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తలు
మేయర్ భర్త విషయంలో అంతిమ నిర్ణయం టీఆర్ఎస్ హైకమాండ్కు వదిలేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆలస్యమైందని.. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు అవసరమని ఎమ్మెల్యేలు సూచించారట. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్పై భూ వివాదాల ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా దృష్టి పెట్టారట అధికారపార్టీ నేతలు. దీంతో మేయర్ భర్త గురించి తెలిసినా.. MLAలు చేతులు కాలకా ఆకులు పట్టుకున్నారని చెవులు కొరుక్కుంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. మరి.. పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
-
Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
-
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
-
Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!