Nizamabad Mlas Headache : తల పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నారు అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు. అనుచరుడు ఏకు మేకై వ్యవహారాలు నడపటంతో తలపట్టుకున్నారట. తాజా ఘటనలో అధిష్ఠానానికి MLAలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ పెరుగుతోందట.
ఎమ్మెల్యేలకు మింగుడు పడని మేయర్ భర్త తీరు
నిజామాబాద్ నగరంలోని సాయినగర్లో 300 గజాల స్థలం టీఆర్ఎస్లో చిచ్చు రాజేసింది. విలువైన ఈ స్థలం కోసం అధికారపార్టీ నేతలు వీధిపోరాటానికి దిగడం.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. అనుచరుడు కదా అని అందలం ఎక్కిస్తే.. ప్రజల్లో పరువు తీస్తున్నాడని మేయర్ భర్త తీరుపై లబోదిబోమంటున్నారట ఎమ్మెల్యేలు. ఈ ఘటనలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్ గుప్తలకు మేయర్ దండు నీతు భర్త శేఖర్ తీరు మింగుడుపడటం లేదట.
Also Read
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
- Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
నష్ట నివారణ చర్యల్లో ఎమ్మెల్యేలు
ఆ మధ్య నిజామబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చినప్పుడు.. భూ వివాదాల విషయంలో మేయర్ భర్తను గట్టిగానే హెచ్చరించారు. కానీ శేఖర్ తీరు మారక.. ఇప్పుడు రోడ్డెక్కడంతో అది ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియక కలవర పడుతున్నారట ఎమ్మెల్యేలు. పైగా ఈ వివవాదంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి అల్లుడు సంపత్ పేరు ప్రస్తావనకు రావడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
సీనియర్ల మధ్య వివాదాలు తలెత్తకుండా అలర్ట్
వివాదానికి కారణమైన వ్యక్తులను కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితులు తెలుసుకొనే ప్రయత్నం చేశారట ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గణేష్గుప్తా. చివరకు దండు శేఖర్పై అసహనం వ్యక్తం చేసి.. దూకుడు తగ్గించాలని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సమస్య రోడ్డెక్కి రచ్చ కావడంతో విషయాన్ని టీఆర్ఎస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట ఎమ్మెల్యేలు. గతంలోనే ఎమ్మెల్సీ కవిత హెచ్చరించి ఉండటంతో.. తాజా రగడ పార్టీ సీనియర్ల మధ్య కొత్త వివాదాలు తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నారట.
టీఆర్ఎస్పై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తలు
మేయర్ భర్త విషయంలో అంతిమ నిర్ణయం టీఆర్ఎస్ హైకమాండ్కు వదిలేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆలస్యమైందని.. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు అవసరమని ఎమ్మెల్యేలు సూచించారట. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్పై భూ వివాదాల ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా దృష్టి పెట్టారట అధికారపార్టీ నేతలు. దీంతో మేయర్ భర్త గురించి తెలిసినా.. MLAలు చేతులు కాలకా ఆకులు పట్టుకున్నారని చెవులు కొరుక్కుంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. మరి.. పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?