Nandikotkur Politics : నందికొట్కూరు వైసీపీలో మూడేళ్ళుగా ఒకటే పంచాయితీ.. అంశమేదైనా భగ్గుమనాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandikotkur Politics : మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకన్నట్టుగా ఉంది నందికొట్కూరులో వైసీపీ నేతల పోరు. మూడేళ్లుగా ఒక్కటే పంచాయితీ. అంశం ఏదైనా భగ్గు మనాల్సిందే. అసలే ఉప్పు నిప్పుగా ఉన్న ఇద్దరి మధ్య కొత్త విషయం మరింత అగ్గిరాజేసింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఆర్థర్.. నందికొట్కూరు ఎమ్మెల్యే. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నందికొట్కూరు వైసీపీ ఇంఛార్జ్. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఇద్దరి నేతల మధ్య జరిగిన వర్గపోరు గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. పార్టీ పరంగా ఒకే గూటిలో ఉన్నా.. ఆధిపత్య పోరుకు వచ్చే సరికి ఎవరికి వారే. తగ్గేదే లేదన్నట్టుగా ఉంటోంది వైరం. ఎదురుపడితే ఏమౌతుందో కూడా పార్టీ కేడర్కు అర్థం కాని పరిస్థితి. రచ్చ రచ్చ అయిన సందర్భాలు అనేకం. పరస్పరం పోలీసు కేసులు పెట్టుకున్న ఉదంతాలు కోకొల్లలు. వీరి మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు అనేకసార్లు విఫలయత్నం చేశారు. ఈ మూడేళ్ల కాలంలో విభేదాలు పీక్స్కు చేరుకున్నాయే తప్ప.. ఇసుమంత మాత్రం బ్రేక్ లేదనే చెప్పాలి. తాజాగా ఆర్థర్, బైరెడ్డి మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. అది గట్టిగానే రాజుకుంటోందట.
Also Read
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుచరులకు టికెట్ ఇచ్చే విషయంలో ఆర్థర్, బైరెడ్డి వర్గాలు రోడ్డెక్కి నానా రభస చేశాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇద్దరినీ కలిసి తిరగాలని సూచించారు పార్టీ పెద్దలు. ఆ హితోక్తులను ఒక చెవితో విని ఒంకో చెవితో బయటకు వదిలేశారని కామెంట్స్ చేస్తుంటాయి నందికొట్కూరు వైసీపీ శ్రేణులు. తాజాగా బ్రాహ్మణకొట్కూరు సింగిల్ విండో చైర్మన్ నియామకం చిచ్చు రేపుతోంది. సింగిల్ విండో చైర్మన్గా సతీష్రెడ్డి ఉండేవారు. జులై 13నే ఆయన పదవికాలం ముగిసింది. ఆ పదవిలో మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డి బంధువు మద్దూరు హరి సర్వోత్తమ రెడ్డిని నియమించాలని ఎమ్మెల్యే ఆర్థర్ ప్రతిపాదించారట. అయితే ఓంకార్రెడ్డి అనే నేతకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి సూచించారట. దీనిపై ఆర్థర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అంజాద్ బాషాల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఆ సమయంలోనూ ఆర్థర్.. బైరెడ్డి వర్గాలు తీవ్రస్థాయిలో తిట్టేసుకున్నాయట.
ఇంతలో బ్రాహ్మణకొట్కూరు సింగిల్ విండో అధ్యక్షునిగా మద్దూరు హరిసర్వోత్తమ్ రెడ్డిని నియమిస్తూ జీవో విడుదలైంది. ఆయన బాధ్యతలు చేపట్టి మినిట్ బుక్లో సంతకాలు కూడా చేశారట. సహకార శాఖ అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చి సింగిల్ విండో చైర్మన్గా హరి సర్వోత్తమ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలి. దానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం మోకాలడ్డినట్టు తెలుస్తోంది.
అంతేకాదు.. సింగిల్ విండో చైర్మన్ గా హరిసర్వోత్తమ్ రెడ్డి పేరు నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వు ఇప్పించారనే ప్రచారం కూడా ఉంది.
ఈ ఆధిపత్య రగడ కారణంగా బ్రాహ్మణకొట్కూరు సహకార సొసైటీకి పాలకవర్గం లేకుండా కొనసాగుతోంది. వివాదం కారణంగా సొసైటీ ద్వారా రైతులకు అందాల్సిన రుణాలు కూడా అందడం లేదట. మొత్తమ్మీద నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీలో విబేధాల వల్ల ప్రతిదీ వివాదమే అవుతోంది. మరి.. ఈ వర్గపోరుకు పార్టీ పెద్దలు ఎప్పుడు చెక్ పెడతారో చూడాలి.
తాజావార్తలు
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!