తనయుడి కోసం ఎంపీ మాగుంట కొత్త ఎత్తుగడ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికల నాటికి వారసుడిని బరిలో దించాలన్నది ఆ ఎంపీ ఆలోచన. ఇందుకోసం ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. విషయం తెలుసుకున్న అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బుసలు కొడుతున్నారట. ఇది కాస్తా గుప్పుమనడంతో రెండువర్గాల మధ్య వార్ ఓ రేంజ్లోకి చేరుకుంది. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం.
తనయుడి కోసం ఎంపీ మాగుంట కొత్త ఎత్తుగడ!
Also Read
రాజకీయాల్లో తండ్రి కీలక స్థానంలో ఉంటే.. తనయులు ఆయన్ని అనుసరించడం కామన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా పాలిటిక్స్లో వారసులకు ఓనమాలు దిద్దిస్తారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారట. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల ద్వారా తెరమీదకు తెచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. ఎంపీగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో కాకుండా.. కుమారుడి కోసం ఇంకో స్థానాన్ని ఎంపిక చేసుకోవడంతో ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
గిద్దలూరులో మాగుంట తనయుడు రాఘవరెడ్డి పర్యటనలు
అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి వారసత్వంగా మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఒంగోలు లోక్సభ స్థానం నుంచి మూడుసార్లు కాంగ్రెస్.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. జనంలో క్రేజ్ ఉన్నప్పుడే వారసుడు రాఘవరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని గిద్దలూరు అసెంబ్లీలో తరచుగా చక్కర్లు కొట్టిస్తున్నారట. 2019 ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో మాగుంటకి భారీ మెజారిటీ రావడం.. తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆయన గిద్దలూరుపై కన్నేశారని వైసీపీలో టాక్. దీంతో మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఏదో ఒక కార్యక్రమం పేరుతో గిద్దలూరులో తరచుగా పర్యటిస్తున్నారట.
రాఘవరెడ్డి టూర్లపై ఎమ్మెల్యే రాంబాబు గుర్రు
గిద్దలూరులో వైసీపీ నుంచి అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా సొంత పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నచోట.. రాంబాబుకు చెప్పకుండానే రాఘవరెడ్డి పర్యటనలు సాగుతున్నట్టు సమాచారం. అంతేకాదు.. కుమారుడి కోసం నియోజకవర్గంలో సొంతంగా ఒక వర్గాన్ని మాగుంట సిద్ధం చేశారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి తాచుపాములా బుస కొడుతున్నారట ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఎంపీ తనయుడు పర్యటనలకు వెళ్లొద్దని.. అనుచరులకు, అధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారట ఎమ్మెల్యే. వైసీపీ ముఖ్య నేతలకు కూడా గిద్దలూరులో ఎంపీ మాగుంట చేస్తున్న పాలిటిక్స్పై రాంబాబు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
గిద్దలూరులో రెండువర్గాల మధ్య ఆధిపత్యపోరు!
గిద్దలూరులో ప్రస్తుతం వైసీపీ రాజకీయాలు ఎంపీ మాగుంట వర్సెస్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నట్టుగా మారాయి. రెండు వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయట. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈలోగా ఈ ఆధిపత్య పోరు ఏ స్థాయికి వెళ్తుందో.. ఎటు దారితీస్తుందో తెలియక కేడర్ ఆందోళన చెందుతుందట. రెండు వర్గాల మధ్య రాజకీయం ఉప్పు నిప్పులా ఉంది. ఇద్దరూ బలమైన నాయకులే కావడంతో వారి వర్గాలు సైతం వెనక్కి తగ్గేలా లేవు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.. ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.
- Tags
- MP Magunta
- off the record
- ycp
తాజావార్తలు
-
G7 Summit: ప్రపంచ నేతల సదస్సులో ఒంటరిగా ట్రంప్.. ఫొటో వైరల్
-
AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
-
APFTDC : నంది అవార్డుల నిర్వహణపై ఏపీ ఫిలిం కార్పొరేషన్ కీలక అడుగు
-
RCB Captain: ఆర్సీబీ కెప్టెన్ రేంజ్ అది.. క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు..
-
LRLACM: భారత స్వదేశీ ‘‘తోమహాక్’’.. పాక్, చైనాలకు ముచ్చెమటలు గ్యారెంటీ..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?