పాస్ మార్కులు పడని ఎమ్మెల్యేలు ఔట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరసగా మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటోంది టీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల క్షేత్రానికి కావాల్సిన రణతంత్రాన్ని పక్కాగా రచిస్తోంది. ఇందులో కీలకం ఐపాక్తో కుదుర్చుకున్న ఒప్పందం. గతంలో ప్రశాంత్కిశోర్ నేతృత్వంలోని ఐపాక్ పలు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసింది. ఆయా రాజకీయ పార్టీల నిర్మాణం.. కార్యక్రమాల అమలు క్షుణ్ణంగా అధ్యయనం చేసింది ఐపాక్. ఆ అనుభవంతోపాటు తెలంగాణలో ఉన్న పరిస్థితి… టీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో ఉన్న ప్లస్సులు.. మైనస్లపై గ్రౌండ్ రిపోర్ట్స్ను ఎప్పటికప్పుడు అధినాయకత్వానికి అందజేయనుంది సర్వే బృందం. ఆ రిపోర్ట్స్ ఆధారంగా టీఆర్ఎస్ నాయకత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నారు.
ఇన్నాళ్లూ టీఆర్ఎస్లో పార్టీ కార్యక్రమాల అమలుపై ఇంఛార్జుల నుంచి నివేదికలు అందేవి. ఇప్పుడలా ఉండకపోవచ్చు. ఈ మధ్య కాలంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది టీఆర్ఎస్. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేసింది. ఈ కార్యక్రమాలు కొన్నిచోట్ల సక్సెస్ అయితే.. మరికొన్నిచోట్ల నామమాత్రంగా సాగాయి. ఇప్పుడు ఐపాక్ ఎంట్రీతో నిర్లక్ష్యంగా ఉండే నాయకుల తీరు క్షణాల్లో హైకమాండ్కు చేరిపోతుంది. ఏం చెప్పినా లైట్గా తీసుకునేవారి ఆటలు సాగబోవన్నది గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
టీఆర్ఎస్ పిలుపిచ్చే కార్యక్రమాల అమలు గ్రౌండ్ లెవల్లో ఎలా ఉంటుందో.. ఎవరు చురుకుగా పనిచేస్తున్నారో.. ఎవరు నాటకాలు ఆడుతున్నారో ఐపాక్ బృందం పసిగట్టేస్తుంది. పైగా సర్వే బృందంలో ఎవరు ఉంటున్నారో.. వారెవరో టీఆర్ఎస్ నేతలకు తెలిసే అవకాశం లేదు. గుంపులో గోవిందగా ఉంటారు ఆ సంస్థ సభ్యులు. దీంతో ఐపాక్ ఇచ్చే నివేదికలే టీఆర్ఎస్ నేతల భవిష్యత్ తలరాతలను రాస్తాయని చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో సిట్టింగ్లకే ఎక్కువ ఛాన్స్ ఇచ్చింది. కొందరినే మార్చింది. ఇప్పుడు సర్వేలో పాస్ మార్కులు పడేది ఎంత మందికి? పార్టీ అంచనాలను అందుకోలేని వారు ఎవరు? అనేది బయటకు పొక్కే అవకాశాలు లేవు.
గతంలో పార్టీ ఇంఛార్జులు సమీక్షలకు వస్తే.. టికెట్ ఆశించే వాళ్లు బలప్రదర్శనలకు దిగేవాళ్లు. లేదా ఆ ఇంఛార్జులను బుట్టలో వేసుకోవడానికి.. అనుకూలంగా రిపోర్టులు ఇప్పించుకోవడానికి జిమ్మిక్కులు అనేకం చేసేవారు. ఇప్పుడా పప్పులు ఉడకవు. లైట్గా తీసుకునేవారికి ఫీజు కొట్టేయడం ఖాయం. ఇప్పటికే ఐపాక్ బృందాలు నియోజకవర్గాల్లో దిగిపోతున్నాయి. అందుకే ఆ సంస్థ మాట వినిపించగానే ఉలిక్కి పడుతున్నారట టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు. మరి.. ఈ వడపోతల్లో ఎంతమంది నిలుస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!