యానాంలో పొన్నాడ చేసిన పనికి మల్లాడి రివెంజ్?
మంత్రి కావాలని అనుకున్న ఆ ఎమ్మెల్యే ఆశలు ఆడియాసలు అయ్యాయి. రెండుసార్లు ఆయన పేరు ప్రస్తావనకు వచ్చినా.. చివరిక్షణంలో ఛాన్స్ మిస్. దీనికంతటికీ ఆయన రాజకీయ గురువే కారణమని చెవులు కొరుక్కుంటున్నారట. శిష్యుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని టాక్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎవరా గురువు?
చివరి వరకు రేస్లో.. లాస్ట్లో ఛాన్స్ మిస్ కోనసీమ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ముమ్మిడివరం. ఇక్కడి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు పొన్నాడ సతీష్కుమార్. మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా వెళ్లిన టైమ్లో.. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన పొన్నాడ సతీష్కు మినిస్టర్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. పిల్లి బోస్ రాజ్యసభకు వెళ్లడంతో ఆయన ఖాళీ చేసిన మంత్రి పదవిని అదే సామాజికవర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్కు ఇచ్చారు. మోపిదేవి స్థానంలో పొన్నాడ పేరు పరిశీలనకు వచ్చినా ముమ్మిడివరం నియోజకవర్గం.. రామచంద్రపురం పక్కపక్కనే కావడంతో సతీష్కు మంత్రి పదవి మిస్ అయ్యింది. ఈసారి తప్పకుండా ఛాన్స్ ఇస్తారని మరోసారి ఎమ్మెల్యే పేరు చర్చల్లోకి వచ్చింది. చివరి వరకు ఆయన పేరు రేస్లో ఉంది కూడా. ఏమైందో ఏమో లాస్ట్మినిట్ మళ్లీ పొన్నాడ పేరు మిస్. దీంతో పొన్నాడు సతీష్కు మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఏంటనే చర్చ జోరందుకుంది.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
మల్లాడి అడ్డుపడ్డారా? మంత్రివర్గాన్ని సమూలంగా మార్చేసి.. కొత్తవారిని తీసుకుంటారని అనుకున్నా.. కేబినెట్లో పాత ముఖాలే ఎక్కువగా ఉండటంతో అమాత్య పదవికి దూరం అయ్యారనేది ఒక వాదన. పైగా తన వంతు ప్రయత్నాలు సతీష్ చేయలేదనే కామెంట్సూ వినిపిస్తున్నాయి. దీంతో అనుచరులు తీవ్ర నిరాశలో పడిపోయారు. ఇదే సమయంలో పొన్నాడకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం అంటూ.. మరో చర్చ కూడా జరుగుతోంది. పొన్నాడకు రాజకీయ గురువు.. పుదుచ్చేరి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావేనని ప్రచారం నడుస్తోంది.
యానాంలో ఓటమికి కసి తీర్చుకున్నారా? యానాం ఎన్నికల్లో మల్లాడికి వ్యతిరేకంగా పొన్నాడ ప్రచారం చేసి అశోక్ ఎమ్మెల్యేగా గెలిచేందుకు సహకరించారనే అనుమానాలు ఉన్నాయట. అప్పటి నుంచి పొన్నాడకు ఆయన రాజకీయ గురువు మల్లాడికి మధ్య దూరం పెరిగిందనే వాదన ఉంది. ఒకదశలో మల్లాడి ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తానని ప్రకటించారు. సీఎం జగన్తో భేటీ అయ్యి టీటీడీలో సభ్యుడిగా పదవీ దక్కించుకున్నారు. యానాం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మల్లాడి.. ఎమ్మెల్యే పొన్నాడ ఆశలకు చెక్ పెట్టారని సందేహిస్తున్నారట. ఆ విధంగా యానాంలో ఓటమికి కసి తీర్చుకున్నట్టు .. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు చర్చించుకుంటున్నారు.
పొన్నాడ వర్గీయులు గుర్రు మంత్రివర్గం కూర్పుపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే పొన్నాడకు కేబినెట్లో చోటు దక్కబోదని మల్లాడి వర్గం ప్రచారం చేసిందట. చివరకు అదే నిజమైంది. దీంతో ఎమ్మెల్యే పొన్నాడ వర్గీయులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. నిజంగా మల్లాడి చెబితేనే సీఎం జగన్ ఎమ్మెల్యే పొన్నాడను దూరం పెట్టారా? అన్నది కొందరి ప్రశ్న. కారణం ఏదైనా మంత్రి పదవికి పొన్నాడ సతీష్ దూరంగా ఉండిపోయారు. మల్లాడి వర్గీయులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారట.
తాజావార్తలు
-
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!