Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Leaders Silence On New Districts Movements In Anantapur

Leaders Silence: ఈ మౌనానికి అర్థమేంటి?

Published Date :February 20, 2022 , 8:36 am
By NTV WebDesk
Leaders Silence: ఈ మౌనానికి అర్థమేంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ ప్రాంతంలో జిల్లా విభజనపై ఒక రేంజ్‌లో ఉద్యమం జరుగుతుంటే.. ఒక మంత్రి.. ప్రతిపక్షపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం సైలెంట్‌ అయ్యారు. మొన్నటి వరకు మాకు ఓటేయండి.. మన ఊరిని జిల్లా కేంద్రం చేయిస్తామని హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. నేతలను కదిపితే నోకామెంట్ అంటున్నారట. ఆ ప్రాంత నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?

మున్సిపల్‌ ఎన్నికల్లో పెనుకొండే ప్రచార అస్త్రం

అనంతలో జిల్లాల విభజనపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుపై హిందూపురంలో పెద్దఉద్యమమే జరుగుతోంది. జిల్లాలో అనంతపురం తర్వాత పెద్ద పట్టణమైన హిందూపురాన్ని కాకుండా మరో ప్రాంతాన్ని జిల్లా కేంద్రం ఎలా చేస్తారని ఉద్యమిస్తున్నారు. ఈ పోరాటంలోకి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడంతో రెండురోజులపాటు జిల్లాలో రచ్చ రచ్చ అయింది. వాస్తవంగా జిల్లాల విభజన ప్రతిపాదన వచ్చాక ముందుగా వినిపించిన పేరు పెనుకొండ. అన్ని ప్రాంతాలకు సమానమైన దూరం, గొల్లపల్లి రిజర్వాయర్, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండటం.. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పట్టణం కావడంతో ఇక్కడే జిల్లా కేంద్రం ప్రకటించాలని ఉద్యమం జరిగింది. కరోనా కారణంగా కాస్త సైడ్‌ అయినా.. మున్సిపల్‌ ఎన్నికల్లో పెనుకొండ అంశమే ప్రధాన ప్రచారాస్త్రమైంది.
..spot..

పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలన్న వాళ్లు నోరు మెదపడం లేదు

పెనుకొండ మంత్రి శంకర్‌నారాయణ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ జిల్లా కేంద్రాన్ని తీసుకొస్తామని ఆయన హామీలు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పార్థసారధి కూడా ఇదే అంశాన్ని చాలాసార్లు డిమాండ్ చేశారు. ఇదే హామీతో మంత్రి శంకర్‌నారాయణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీని గెలిపించారు కూడా. అయితే జిల్లా కేంద్రం పెనుకొండ కాకుండా పుట్టపర్తికి వెళ్లింది. ఈ అంశంపై హిందూపురంలో పెద్ద ఉద్యమమే జరుగుతుంటే.. నిన్న మొన్నటి వరకు పెనుకొండ కోసం పట్టుబట్టిన వాళ్లు మాత్రం నోరు మెదపడం లేదు. ఏడాది క్రితం పెనుకొండ జిల్లా సాధన సమితి కూడా ఏర్పటైంది. జిల్లా కేంద్రం తమ ఆకాంక్ష అని..చివరి వరకు పోరాటం చేసినా సాధ్యం కాలేదని మంత్రి చేతులు ఎత్తేశారు. తనవల్ల కానిది అవుతుందని చెప్పడం కంటే హ్యాండ్సప్‌ బెటర్‌ అనుకున్నట్టున్నారు మంత్రి.

బాలయ్య ఎంట్రీతో పార్థసారథి సైలెంట్‌

అయితే జనం నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న మంత్రి శంకర నారాయణే ఇలా స్పందిస్తుంటే.. ఈ విషయంలో అధికారపార్టీని కార్నర్‌ చేయాల్సిన మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అస్సలు నోరు విప్పడం లేదు. ఆయన కొన్నేళ్లుగా పెనుకొండ నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రంపై సైలెంట్‌ అయ్యారు. దానికీ బలమైన కారణం లేకపోలేదు. పార్థసారథి ప్రస్తుతం టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఓపక్క హిందూపురం కోసం బాలయ్య రంగంలోకి దిగడంతో పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలని అడిగితే మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు పుట్టపర్తి, కదిరి, మడకశిక ప్రాంత వాసులు దానిని తీవ్రంగా తప్పుపట్టి, వ్యతిరేకించే అవకాశం ఉండటంతో ఆయన మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది.

టీడీపీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిందా?

మొత్తంమీద ఎవరూ ఊహించని సమయంలో జిల్లా విభజన తీసుకొచ్చి.. టీడీపీని ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి సీఎం జగన్‌ పడేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. పైకి నవ్వుతూ కనిపించినా.. నాలుగు గోడల మధ్య తమ రాజకీయ భవిష్యత్‌ను తలచుకుని టెన్షన్‌ పడుతున్నారట. మరి.. ఈ సమస్య నుంచి పెనుకొండ నేతలు ఎలా బయటపడతారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anantapur
  • ap politics
  • Balayya
  • cm jagan
  • New disticts

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions