Annavaram : దేవుడికి శఠగోపం పెడుతున్న వారిని కదిలించడం కష్టమేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏటా 120 కోట్ల ఆదాయం వచ్చే ఈ పుణ్య క్షేత్రంలో 238 మంది పని చేస్తున్నారు. ఆలయంలో ఐదేళ్లు పైబడి ఒకేచోట తిష్ఠవేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఆ జాబితాలో 80 మందిని గుర్తించారట. నెలాఖరులోగా ఆ ప్రక్రియ కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ ఏళ్ల తరబడి అన్నవరం ఆలయంలోనే పాతుకుపోయిన వారిలో గుబులు రేగుతోందట.
బదిలీ అయినా ఆరు నెలల్లో తిరిగి అన్నవరం ఆలయానికి వచ్చేసేలా పరస్పర ఒప్పందాలు చేసుకోవడానికి రాజకీయ పైరవీలు మొదలుపెట్టేశారట ఇక్కడి ఉద్యోగులు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల లేఖలతో దేవాదాయశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు పెంచేశారట. అన్నవరం నుంచి వెళ్లిపోతే అక్రమార్జనకు గండి పడుతుందనే ఆందోళనతో నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారట. వాస్తవానికి అన్నవరం ఆలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులపై ఎప్పటి నుంచో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వారికి చెక్ పెట్టాలని ఎప్పటికప్పుడు అనుకుంటున్నా కాగితం ముందుకు కదలడం లేదు. ఈ దఫా మాత్రం 80 మంది కదులుతారని చెప్పడంతో పెద్ద చర్చే జరుగుతోంది.
Also Read
రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాలకు చెందిన సిబ్బంది నివేదికను వెంటనే ఇవ్వాలని సంబంధిత ఆలయాల ఈవోలకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బదిలీ చేయడానికే ఆ ఆదేశాలు ఇచ్చినట్టు ఉద్యోగులు భావిస్తున్నారట. 2016 నుంచి అన్నవరం ఆలయంలో బదిలీలు లేవు. ఆ ఏడాది 24 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. వారిలో ఒకరిద్దరు మినహా మిగతావారంతా ఏడాది లోపే తిరిగి అన్నవరం ఆలయానికి వచ్చేశారు. 2021లోనూ బదిలీలకు కసరత్తు చేసినా.. కోవిడ్ వల్ల ఆ ప్రయత్నాలు విరమించారు. అన్నవరం గుడిలోని ఇంజనీరింగ్.. ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేసే కొందరు ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా బదిలీ కాలేదని చెబుతారు.
ఇప్పుడు జాబితాలో ఉన్నారని చెబుతున్న 80 మంది కూడా.. తాము బదిలీ అయినా పెద్దగా ఇబ్బంది లేదని.. రాజకీయ సిఫారసులతో ఆరు నెలల్లో వచ్చేస్తామని సహచరుల దగ్గర చెబుతున్నారట. అయితే అవినీతి ఆరోపణలు ఉన్నవారి చిట్టా ఏసీబీకి కూడా చేరినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే బదిలీ చేసినా కామ్గా వెళ్లి.. కొత్తచోట కొన్నాళ్లు పనిచేసుకుందామని అనుకుంటున్నారట. ఆ మధ్య సీఎం జగన్ ఆదేశాలతో అన్నవరం కొండపై రెండు దఫాలుగా విజిలెన్స్ అధికారులూ తనిఖీలు చేపట్టారు. ఈ తరుణంలో అన్నవరం ఆలయంలో బదిలీలపై దేవాదాయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. మరి.. కొండపై తిట్టవేసిన కట్టలపాములను సాగనంపుతారో.. లేక ఎప్పటిలా 6 నెలల్లో తిరిగి పుట్టల్లోకి అవినీతిపరులు చేరుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!