TRS : ఉప్పల్ లో స్పీడ్ పెంచిన లక్ష్మారెడ్డి.. పార్టీ మారబోతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బండారు లక్ష్మారెడ్డి. ప్రస్తుతం ఉప్పల్ trs నాయకుడు. మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సోదరుడు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు లక్ష్మారెడ్డి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు మంత్రి హరీష్రావుకు కూడా సన్నిహితoగా ఉంటున్నారాయన. నాడు ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు సపోర్ట్ చేయాలని పార్టీ ఆదేశించడంతో లక్ష్మారెడ్డి సహకరించారు. GHMC ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో తనవర్గం వారికి కూడా కొన్ని సీట్లు ఇప్పించుకున్నారు. ఇద్దరిని గెలిపించుకున్నారు కూడా. ఐతే ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న బండారు లక్ష్మారెడ్డి ఇప్పుడు స్పీడ్ పెంచారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నియోజకవర్గం అంతా ప్లెక్సీలు.. కట్ ఔట్లతో హల్ చల్ చేశారు.
ఇంతలో ఏమైందో ఏమో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు లక్ష్మారెడ్డి. దగ్గర బంధువు ఫంక్షన్లో ఇద్దరు గంటకుపైగా మంతనాలు చేశారు. రాజకీయంగా చర్చలు జరిపినట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న లక్ష్మారెడ్డి.. పీసీసీ చీఫ్తో ఏం మాట్లాడారన్నది ఆసక్తిగా మారింది.
Also Read
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
- OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
- Off The Record: ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ నేతలు వెళ్తారా..? తెలుగు తమ్ముళ్లలో కొత్త టెన్షన్
- OTR : తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీకి ఢిల్లీ పిలుపు..రేవంత్ టీమ్లో హైటెన్షన్ ఎందుకు?
ఉప్పల్ టీఆర్ఎస్లో ఇప్పటికే ఆశావాహులు హడావిడి ఉంది. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి పోటీగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్యక్రమాలు చేస్తున్నారు. బొంతు భార్య ఈ నియోజకవర్గం పరిధిలోనే కార్పొరేటర్. ఈ దఫా ఉప్పల్లో తానే పోటీ చేస్తా అని ప్రచారం చేసుకుంటున్నారు మాజీ మేయర్. ఎమ్మెల్యే సుభాష్రెడ్డి భార్య కార్పొరేటర్గా ఓడిపోవడం.. రెండుసార్లు ఎమ్మెల్యేగా భేతి ఉండటంతో ఒకరికి ఒకరు పోటీ పడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు అధిష్టానం దృష్టి కి కూడా వెళ్లాయి. హైకమాండ్ క్లాస్ కూడా పీకింది. ఈ ఇద్దరి మధ్య తాను టీఆర్ఎస్లో ఇమడగలనా అని లక్ష్మారెడ్డి ఆలోచిస్తున్నారట.
పీసీసీ చీఫ్ రేవంత్ .. లక్ష్మారెడ్డికి కాంగ్రెస్లో చేరాలని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే తాను ఈసారి ఉప్పల్ నుంచి పోటీ చేయడం ఖాయమని. టీఆర్ఎస్ తనకే టికెట్ ఇస్తుంది అని చెప్పుకుంటున్నారు. పార్టీ మారే ఆలోచన లేదని చెప్పేశారట. రేవంత్తో భేటీ కేవలం ఆ ఫంక్షన్కే పరిమితమని చెబుతున్నారట. మొత్తానికి ఒక సమావేశం ఉప్పల్ రాజకీయాన్ని వేడెక్కించేసింది.
తాజావార్తలు
-
Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!