TRS : ఉప్పల్ లో స్పీడ్ పెంచిన లక్ష్మారెడ్డి.. పార్టీ మారబోతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బండారు లక్ష్మారెడ్డి. ప్రస్తుతం ఉప్పల్ trs నాయకుడు. మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సోదరుడు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు లక్ష్మారెడ్డి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు మంత్రి హరీష్రావుకు కూడా సన్నిహితoగా ఉంటున్నారాయన. నాడు ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు సపోర్ట్ చేయాలని పార్టీ ఆదేశించడంతో లక్ష్మారెడ్డి సహకరించారు. GHMC ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో తనవర్గం వారికి కూడా కొన్ని సీట్లు ఇప్పించుకున్నారు. ఇద్దరిని గెలిపించుకున్నారు కూడా. ఐతే ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న బండారు లక్ష్మారెడ్డి ఇప్పుడు స్పీడ్ పెంచారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నియోజకవర్గం అంతా ప్లెక్సీలు.. కట్ ఔట్లతో హల్ చల్ చేశారు.
ఇంతలో ఏమైందో ఏమో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు లక్ష్మారెడ్డి. దగ్గర బంధువు ఫంక్షన్లో ఇద్దరు గంటకుపైగా మంతనాలు చేశారు. రాజకీయంగా చర్చలు జరిపినట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న లక్ష్మారెడ్డి.. పీసీసీ చీఫ్తో ఏం మాట్లాడారన్నది ఆసక్తిగా మారింది.
Also Read
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
- Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
ఉప్పల్ టీఆర్ఎస్లో ఇప్పటికే ఆశావాహులు హడావిడి ఉంది. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి పోటీగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్యక్రమాలు చేస్తున్నారు. బొంతు భార్య ఈ నియోజకవర్గం పరిధిలోనే కార్పొరేటర్. ఈ దఫా ఉప్పల్లో తానే పోటీ చేస్తా అని ప్రచారం చేసుకుంటున్నారు మాజీ మేయర్. ఎమ్మెల్యే సుభాష్రెడ్డి భార్య కార్పొరేటర్గా ఓడిపోవడం.. రెండుసార్లు ఎమ్మెల్యేగా భేతి ఉండటంతో ఒకరికి ఒకరు పోటీ పడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు అధిష్టానం దృష్టి కి కూడా వెళ్లాయి. హైకమాండ్ క్లాస్ కూడా పీకింది. ఈ ఇద్దరి మధ్య తాను టీఆర్ఎస్లో ఇమడగలనా అని లక్ష్మారెడ్డి ఆలోచిస్తున్నారట.
పీసీసీ చీఫ్ రేవంత్ .. లక్ష్మారెడ్డికి కాంగ్రెస్లో చేరాలని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే తాను ఈసారి ఉప్పల్ నుంచి పోటీ చేయడం ఖాయమని. టీఆర్ఎస్ తనకే టికెట్ ఇస్తుంది అని చెప్పుకుంటున్నారు. పార్టీ మారే ఆలోచన లేదని చెప్పేశారట. రేవంత్తో భేటీ కేవలం ఆ ఫంక్షన్కే పరిమితమని చెబుతున్నారట. మొత్తానికి ఒక సమావేశం ఉప్పల్ రాజకీయాన్ని వేడెక్కించేసింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!