కృష్ణాజిల్లా ఉద్యోగ వర్గాల్లో మొదలైన అలజడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని చోట్ల అధికారులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. ఈ క్రమంలో కొందరు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇప్పుడా భాగోతాలు వెలుగులోకి రావడంతో ఓ కీలక అధికారి చక్రం తిప్పుతున్నారు.
గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల మేత!
Also Read
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
- OTR : సడన్ గా ఆగిపోయిన గాంధీభవన్ ముఖాముఖి.. కాంగ్రెస్లో మంత్రులపై అధిష్టానం సీరియస్?
- OTR : రెంటికి చెడ్డ రేవడిలా యనమల కృష్ణుడు రాజకీయ జీవితం?
కృష్ణాజిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో మొత్తం వెయ్యికిపైగా పంచాయతీలు ఉన్నాయి. విజయవాడ రూరల్ డివిజన్లోని మేజర్ పంచాయతీల ఆదాయం 50 లక్షల నుంచి కోటిన్నర వరకు ఉంటుంది. సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో రెండున్నరేళ్లు పైగా ఈ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. ఆ కాలంలో పంచాయతీ కార్యదర్శి… మరో గెజిటెడ్ అధికారి పాలనా వ్యవహారాలను చక్కబెట్టేవారు. వారిని జిల్లా స్థాయిలో డీఎల్పీవో పర్యవేక్షించేవారు. అయితే పైస్థాయిలో మానిటరింగ్ సరిగా లేక కొందరు అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారట. వాటిపై ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది.
ఓచర్లపై రూ. లక్షల్లో లావాదేవీలు!
కోటి రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని తేలప్రోలు పంచాయతీ కార్యదర్శిని ప్రభుత్వ సస్పెండ్ చేసింది. ఈ జాబితాలో మరికొన్ని పంచాయతీ కార్యదర్శుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకున్న అక్రమార్కులు.. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఓ కీలక అధికారితో మంత్రాంగం చేస్తున్నారట. బ్యాంకుల ద్వారా జరగాల్సిన లావాదేవీలను.. ఓచర్ల ద్వారా చేపట్టిన అకౌంట్లు తారుమారు చేసినట్లు చెబుతున్నారు. ఉదాహరణకు కోవిడ్ సమయంలో శానిటైజేషన్ చేశామని లక్షన్నర కు ఓచర్ రాసి లక్ష సిబ్బందికి, 50 వేలు మిగతావారు పంచుకున్నారట.
తప్పులు కప్పిపుచ్చే పనిలో ఓ అధికారి!
పారిశుద్ధ్యం, వీధి దీపాలు, కాల్వల పూడికతీత వంటి పనుల పేరుతో చాలా మంది నిధులు బొక్కేసినట్టు చెబుతున్నారు. జగ్గయ్యపేట పరిధిలోని ఓ మేజర్ పంచాయతీలో 11 లక్షల విలువైన వర్క్ను రెండేళ్ల బిల్లులో చూపించారట. ఇదే నియోజకవర్గానికి చెందిన మరో పంచాయతీలో లెక్కలు చూపించకుండా 60 నుంచి 70 లక్షలు ఖర్చు చేసినట్లు పుస్తకాల్లో రాసేశారట. గన్నవరం పరిధిలోని చాలా గ్రామాల్లో భవన నిర్మాణాలకు అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఓ అధికారి అయితే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించకుండా ఫైల్స్ అన్నీ తన దగ్గరకే తెప్పించుకున్నారట. అందులో అభ్యంతరాలను ఆయన తోసిపుచ్చి నట్టు చెబుతున్నారు.
అధికార పార్టీ నేతల దగ్గరకు అక్రమార్కులు క్యూ!
ఈ అక్రమాలపై కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి ఉప్పందడంతో సర్కార్ సీరియస్ అయినట్టు సమాచారం. విజిలెన్స్ విచారణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఒక జట్టుగా ఏర్పడి అధికార పార్టీ నేతలను కలిసి లాబీయింగ్ చేస్తున్నారట. మరి.. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ వర్గాల్లో గుబులు రేపుతున్న ఈ అంశం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!