రాజకీయ భవిష్యత్ పై ఆ నేతకు క్లారిటీ లేకుండా పోయిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొండా విశ్వేశ్వర్రెడ్డి. మాజీ ఎంపీ. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానంతో 2013లో గులాబీ కండువా కప్పుకొన్న విశ్వేశ్వర్రెడ్డి.. 2014 లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నాటకీయ పరిణామాల మధ్య టీఆర్ఎస్కు రాజీనామ చేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగినా 13వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్లోనూ ఉక్కపోత ఫీలయ్యారు విశ్వేశ్వర్రెడ్డి. 2021 మార్చిలో హస్తంపార్టీకి హ్యాండిచ్చారు. అప్పటి నుంచి ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీలోకి వెళ్తారని కొన్నిసార్లు.. కాదు తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకొంటారని మరికొన్నిసార్లు ప్రచారం జరిగినా.. ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేదు. తెలంగాణలో ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్తున్నా.. ఈ మాజీ ఎంపీకి చురుకు పుట్టడం లేదు. దాంతో కొండా దారెటు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వర్తమాన రాజకీయ నాయకులకు కాస్త భిన్నంగా కనిపిస్తారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. తన రూటే సెపరేట్ అన్నట్టుగా ఉంటుంది ఆయన తీరు. వార్తల్లో వ్యక్తిగా ఉంటారు కానీ.. తన భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎక్కడో.. ఎటువైపో చెప్పరు. అలాగని రాజకీయలను వదిలి పెట్టలేదు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు. ఆ నాయకులతో మాజీ ఎంపీకి ఉన్న సాన్నిహిత్యం చూస్తే విశ్వేశ్వర్రెడ్డి రెండిళ్ల పూజారేమో అనే అనుమానం కలుగుతుంది. ఆయా సందర్భాలను బట్టి కాసేపు బీజేపీకి జైకొడతారు.. మరో సమయంలో కాంగ్రెస్ను ప్రశంసిస్తారు. ఆ మధ్య విశ్వేశ్వర్రెడ్డిని బీజేపీలోకి తీసుకురావడానికి కమలనాథులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. ఆయన నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో పట్టించుకోవడమే మానేశారు బీజేపీ నాయకులు.
Also Read
తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లే ఆలోచనలో ఉండటం వల్లే బీజేపీ ఆఫర్పై విశ్వేశ్వర్రెడ్డి పక్కన పెట్టేశారని చర్చ జరిగింది. కానీ.. ఇటీవల బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్.. ఈ మాజీ ఎంపీతో సమావేశం అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవడమే తరువాయి అని అంతా అనుకున్నారు. కానీ..కథ మళ్లీ మొదటికొచ్చింది. అంతకుముందు హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించాలని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి కొద్దిరోజుల ముందు కాంగ్రెస్పట్ల సానుకూల వైఖరి కనబర్చారు. స్పష్టత లేని ఈ వైఖరే కాంగ్రెస్, బీజేపీ వర్గాలను గందరగోళంలో పడేస్తున్నాయి. మరి.. తెలంగాణలో పొలిటికల్ టెంపరేచర్ పెరుగుతున్న సమయంలోనూ విశ్వేశ్వర్రెడ్డి ఇలా స్వతంత్రంగానే ఉంటారా? లేక కాంగ్రెస్, బీజేపీల్లో దేన్ని ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా.. కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!