Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Kanigiri Ycp Politics

Burra Madhusudan Yadav : ఆ ఎమ్మెల్యేకు నిద్ర కరువైందా..?

Published Date :September 7, 2022 , 11:11 am
By Premchand Chowdary
Burra Madhusudan Yadav  : ఆ ఎమ్మెల్యేకు నిద్ర కరువైందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Burra Madhusudan Yadav  :

అధికారపార్టీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఇంటిపోరు మొదలైందా? మొన్నటి వరకు ద్వితీయశ్రేణి నేతలతో పొసగలేదా? టికెట్‌ ఆశిస్తున్న మరో నాయకుడి తీరు టెన్షన్‌ పెడుతోందా? ఎమ్మెల్యేకు పోటీగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారా? పార్టీ కొత్త బాధ్యతలు అప్పగించినా ఎమ్మెల్యేకు నిద్ర కరువైందా?

బుర్రా మధుసూదన్‌ యాదవ్‌. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే. ఇదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత సత్యనారాయణరెడ్డి.. ప్రస్తుతం రెడ్డి కార్పొరేషన్‌ ఛైర్మన్‌. ఈ ఇద్దరు అధికార పార్టీ నాయకుల మధ్యే రాజకీయం వేడి సెగలు రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని మధుసూదన్‌ యాదవ్‌ చూస్తుంటే.. ఈ దఫా లోకల్‌ లీడర్‌కే ఛాన్స్‌ ఇవ్వాలని సత్యానారాయణరెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో వైసీపీ శిబిరంలో కొత్త సమీకరణాలు.. పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయంపై ఆసక్తి పెరుగుతోంది.

బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ 2014లోనూ ఇదే కనిగిరిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వాస్తవానికి ఆయన సొంతూరు కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలంలో ఉంది. ఈ అంశాన్నే సొంతపార్టీలోని ఎమ్మెల్యే వైరివర్గం చర్చకు పెడుతోంది. లోకల్‌.. నాన్‌ లోకల్‌ అని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోంది. ఈ వర్గపోరు రెండు శిబిరాల మధ్య కొత్త పుంతలు తొక్కుతోంది కూడా. ప్రస్తుతం గణేష్‌ నవరాత్రి వేడుకలు వీరి మధ్య రాజకీయ వేడుకలుగా మారిపోయాయి. ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌తోపాటు సత్యనారాయణరెడ్డి కూడా పోటాపోటీగా ఉత్సవాలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఓపెన్‌గానే కామెంట్స్‌ చేస్తున్నారట సత్యనారాయణరెడ్డి.

ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్నారు. TTD బోర్డు సభ్యుడు కూడా. అధిష్ఠానం దృష్టిలో ఉన్నప్పటికీ.. కనిగిరి వైసీపీలో క్రమేపీ పెరుగుతున్న వ్యతిరేకతే కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదట్లో సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన సామాజికవర్గానికి చెందిన ఓ జడ్పీటీసీ కొందరితో కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు. జిల్లా వైసీపీ నేతలతో టచ్‌లో ఉండి ఆ జడ్పీటీసీ కనిగిరిలో రాజకీయాలు చేస్తున్నారట. ఇప్పుడు రెడ్డి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సత్యనారాయణరెడ్డి వంతు వచ్చింది. ఆయన మాత్రం లోకల్‌ నినాదాన్ని గట్టిగా నమ్ముకున్నారు. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు, శ్రేణులతో టచ్‌లోకి వెళ్తున్నారట.

తనకు మద్దతిచ్చే పార్టీ నేతలతో కలిసి కనిగిరిలో సత్యనారాయణరెడ్డి పర్యటనలు చేయడం వైసీపీలో చర్చగా మారింది. నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన వినాయక మండపాల నుంచి ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌కు, సత్యనారాయణరెడ్డికి ఆహ్వానాలు వెళ్లాయట. ఆ పిలుపులు అందుకుని.. మందీమార్బలంతో మండపాల దగ్గరకు వెళ్తున్నారు. పోటాపోటీగా నినాదాలు హోరెత్తిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కనిగిరి వైసీపీ టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే దక్కుతుందో.. లోకల్‌ నినాదం వర్కవుట్ అయ్యి సత్యనారాయణరెడ్డికి ఛాన్స్‌ ఇస్తారో కానీ.. స్థానిక రాజకీయం మాత్రం సెగలు రేపుతోంది. పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు బుర్రకు బుర్రా పదును పెడతారో లేదో అనే చర్చ ఉంది. మరి కనిగిరి వైసీపీలో ఏం జరుగుతుందో చూడాలి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Reddy Corporation Chairman Satyanarayana Reddy
  • Burra Madhusudan Yadav
  • CM YS Jagan
  • Kanigiri
  • Prakasam

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions