TDP : వచ్చే ఎన్నికల్లో టీడీపీ తాపత్రయం అదేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ ఆవిర్భవించినప్పుడు యూత్ లుక్ ఎక్కువ. తర్వాత యువతను ప్రోత్సహించిన సందర్భాలు అరుదే. తెలుగుదేశం ఆవిర్భవించిన 40 ఏళ్ల తర్వాత… రాబోయే ఎన్నికల్లో 40 శాతం మంది యువతకే ప్రాధాన్యం అన్నది ప్రస్తుతం చంద్రబాబు మాట. 2019 ఎన్నికల తర్వాత పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. దీనికితోడు ఇంఛార్జుల పేరుతోనో.. సీనియర్లు అనే హోదాలోనో చాలా మంది లీడర్లు ఎక్కడికక్కడ పాతుకుపోయారు. వారు పనిచేయరు.. మిగిలిన వారికి అవకాశం ఇవ్వరు అనే విమర్శలు పసుపు శిబిరంలోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో 40 శాతం యువతకే అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 70 వరకు కొత్తవాళ్లకే ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ యంగ్ థియరీని అమలు చేసే పరిస్థితిలో టీడీపీ ఉందా అనేది పార్టీ వర్గాల అనుమానం. ఈ మధ్య కాలంలో చంద్రబాబు పార్టీ కోఆర్డినేటర్లతో వరసగా సమావేశం అవుతున్నారు. వారికి అప్పగించిన నియోజకవర్గాల్లో కనీసం 40 శాతం కొత్త అభ్యర్థులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. యువతను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని చంద్రబాబు చెబుతున్నారట. ఈ క్రమంలో సైలెంట్గా ఉన్న సీనియర్లు బయటకొస్తున్నారు. హడావిడి చేస్తున్నారు కూడా. ఇందుకు కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాలను పార్టీ వర్గాలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. ఆ మధ్య గుడివాడలో తనకు తప్ప టీడీపీకి వేరే ఆప్షన్ లేదని అనుకునేవారు రావి వెంకటేశ్వరరావు. కానీ.. అక్కడ శిష్టలా లోహిత్ను పార్టీ ప్రోత్సహిస్తుండటంతో రావి శిబిరంలో గుబులు మొదలైందట. ఇదే విధంగా గుంటూరు జిల్లాలోనూ చంద్రబాబు దృష్టి ఒక యువనేతపై పడిందట. దాంతో పెదకూరపాడులోని టీడీపీ నేతలు గుమ్మం దాటి బయటకొస్తున్నారట. అయితే వారిని పిలిచి చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు మూడు సెగ్మెంట్ల విషయంలోనూ ఇదే విధమైన చర్చ నడుస్తోంది.
Also Read
ఉమ్మడి విశాఖ జిల్లాలోని చోడవరం, మాడుగుల, యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల్లోనూ ఇదే విధమైన ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఇంఛార్జులుగా సెకండ్ లీడర్షిప్పే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న చర్చ ఏంటి అనేదానిపై చర్చకు అధినేత ఆస్కారం ఇవ్వడం లేదు. యలమంచిలిలో గత ఎన్నికల్లో ఓడిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు వైసీపీలో చేరిపోయారు. అక్కడ పప్పల చలపతిరావు ఉన్నప్పటికీ ప్రగడ నాగేశ్వరరావును ఇంఛార్జ్ను చేసింది టీడీపీ. చోవడరంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన KSNS రాజు అస్త్ర సన్యాసం చేయడంతో.. బత్తుల తాతయ్యబాబుకు నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు అప్పగించారు. ఇంతలో జిల్లా మహానాడు పేరుతో మాజీ ఎమ్మెల్యే రాజు తెరపైకి రావడంతో టీడీపీ శిబిరంలో చర్చ మొదలైంది. ఇక మాడుగులలో మూడు ముక్కలాట సాగుతోంది. భీమిలిలో ఇంఛార్జ్ కోరాడ రాజబాబుకు టికెట్ ఇస్తారో లేదో అని కేడర్కే అనుమానం ఉందట.
అనకాపల్లిలో నిర్వహించిన సమీక్షల్లో ఇంఛార్జుల పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పుడు అభిమానులు, కార్యకర్తలు చప్పట్లు కొట్టడం కనిపించింది. అభ్యర్థులను ఇప్పుడే తేల్చేస్తే.. క్షేత్రస్థాయిలో పనిచేసుకోవడానికి సాధ్యపడుతుందని కొందరు ప్రతిపాదించారట. అయితే మూడేళ్లుగా పత్తా లేని నాయకులు ఇప్పుడు బయటకు రావడం ఇంఛార్జులను కలవర పెడుతోందట. మొత్తానికి సీనియర్లను నొప్పించకుండా యువతకు ప్రాధాన్యం ఇవ్వడం చంద్రబాబుకు సవాలే అన్నది పార్టీ వర్గాల మాట. మూడేళ్లుగా బద్ధకంగా ఉన్న నేతలను రోడ్డెక్కించడానికి మాత్రం యూత్ థియరీ ఉపయోగపడిందని భావిస్తున్నారు. మరి.. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను చంద్రబాబు ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!