V. V. Lakshminarayana : ఆ మాజీ పోలీస్ బాస్ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2024 టార్గెట్గా కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ వంటి ప్రధాన పార్టీల వ్యూహాలతోపాటు మాజీ ఐపీఎస్ వి.వి.లక్ష్మీనారాయణ కదలికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేన తరుఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజాసేవకుడిగా మారతానని “బాండ్ పేపర్” రాసిచ్చినా ఆయన్ని జనం ఆదరించలేదు. ఆ తర్వాత జనసేనకు రాజీనామా చేసి తన ఫౌండేషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. రైతు సమస్యలు, స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ విశాఖకు వచ్చి వెళ్తున్న లక్ష్మీనారాయణ.. ఇప్పుడు గేర్ మార్చారనే ప్రచారం జరుగుతోంది. వివిధ వర్గాలకు చెందిన ముఖ్యులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు కూడా. దీంతో జేడీ ఆలోచనల చుట్టూ ఆసక్తికర చర్చ నడుస్తోంది.
లక్ష్మీనారాయణ కొత్తపార్టీ పెట్టే పనుల్లో ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ అది వాస్తవం కాదట. ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్తపార్టీ పెట్టి మనుగడ సాగించడం అసాధ్యమనే అభిప్రాయంలో ఆయన ఉన్నారట. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఫలితాల తర్వాత జోష్ మీద ఉన్న ఆమ్ ఆద్మీపార్టీవైపు లక్ష్మీనారాయణ ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు. ఆప్ నేతలతో వీవీ టచ్లో ఉన్నట్టు చెబుతున్నారు. ఒకటిరెండు మీటింగ్లు జరిగాయని తెలుస్తోంది. త్వరలో కేజ్రీవాల్తో సమావేశం అవుతారని సమాచారం.
Also Read
గత ఎన్నికల్లో ఎంపీగా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్న తర్వాత మరోసారి అటువంటి ప్రయత్నం చేయకూడదని లక్ష్మీనారాయణ భావిస్తున్నట్టు సమాచారం. అర్బన్ ఓటర్లను ఆకర్షించగలిగినంతగా గ్రామీణ ఓటర్లు కొత్త పార్టీలను, కొత్త ముఖాలను స్వాగతించరనే వాస్తవం తేలిపోవడం కారణంగా చెప్పుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి విశాఖ నుంచి అసెంబ్లీ బరిలో దిగాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నారట. విశాఖ ఉత్తరం లేదా తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే ఫలితం ఏ విధంగా ఉంటుందనే లెక్కలు వేసుకుంటోందట జేడీ టీమ్.
గత ఎన్నికల్లో గాజువాక తర్వాత ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే లక్ష్మీనారాయణకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. కుల, ధన ప్రభావంకంటే అభివృద్ధి మీద ఎక్కువ ఆలోచన చేసే ప్రజలు ఇక్కడ ఎక్కువ. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో లక్ష్మీనారాయణ సామాజికవర్గంపై విస్త్రతమైన చర్చ జరిగింది. ఆయన కులం ముద్రపడకుండా జాగ్రత్తపడినా ఫలితం సాధ్యం కాలేదు. ఈ మధ్యకాలంలో సామాజికవర్గ పెద్దలతో వీవీ సమావేశం అవుతున్నారు. దీంతో లక్ష్మీనారాయణ ఆప్ నుంచి పోటీ చేస్తారా లేక ఇంకేదైనా ఆలోచన ఉందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
రాష్ట్రంలో టీడీపీ-వైసీపీకి ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ వేదిక అవసరం అనే దిశగా లక్ష్మీనారాయణ అడుగులు వేస్తున్నట్టు భోగట్టా. అసెంబ్లీకి ఎక్కడ నుంచి పోటీ చేయాలో తేల్చుకున్న తర్వాత దానిపై మాజీ పోలీస్ బాస్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!