Off The Record: ఆ జిల్లా బీఆర్ఎస్ లో అసంతృప్తి రాగాలు సెట్ అయినట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్లో గ్రూప్ వార్ పెరిగింది. టికెట్ల ప్రకటన తర్వాత నారాజ్గా ఉన్నారు పలువురు నాయకులు. అలాంటి వాళ్ళు పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో అధిష్టానం దూతలు రంగంలోకి దిగి మేటర్ని సెటిల్ చేసే పనిలో ఉన్నారట. మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్రావుని మార్చాలని పట్టుబట్టారు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి. ఆయన టికెట్ ఇస్తే తన వర్గం సహకరించబోదని కూడా తేల్చేశారు. ఏకంగా ప్రెస్మీట్ పెట్టి మరీ ఈ విషయం చెప్పడంతోపాటు కేటీఆర్, హరీష్రావుల జిల్లా టూర్కి కూడా డుమ్మా కొట్టారాయన. పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. దీంతో అరవింద్రెడ్డితో పాటు మరో అసంతృప్త నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ని కూడా బుజ్జగించేందుకు దూతల్ని పంపిందట అధినాయకత్వం. ఇదివరకే పురాణం సతీష్ ఇంటికెళ్లిన బాల్క సుమన్… కలిసి పని చేద్దామని చెప్పినట్టుగా సమాచారం
Also Read
అటు అరవింద్రెడ్డి కూడా గతంలో దివాకర్ రావుని దగ్గరుండి గెలిపించిన తనకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని ఆశించారట. కానీ… అలాంటిదేం లేకపోగా మరోసారి సిట్టింగ్నే అభ్యర్థిగా ప్రకటించడంతో తిరుగుబాటు జెండా ఎగరేసినట్టు తెలిసింది. టిక్కెట్ ప్రకటన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ… అభ్యర్థిని మార్చాల్సిందేనని…బి ఫామ్ ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ ఇస్తే తాను సహకరించబోమని తేల్చి చెప్పారట. సీటు కూడా తనకు కాకుండా బీసీలకు ఇవ్వాలని కొత్త వాదాన్ని తెరమీదికి తెచ్చారాయన. ఈ పరిస్థితుల్లోనే బుజ్జగింపుల పర్వం మొదలైందంటున్నారు.ఇక చెన్నూరు నియోజకవర్గంలో హరీష్ రావు, కేటీఆర్ పర్యటనలు జరిగినా… దూరంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్. ఆయనకు వేరే నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతో వెనక్కి తగ్గినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీలో టికెట్ ప్రకటన తర్వాత అసంతృప్తిగా ఉన్న కొంతమంది, వివిధ అవసరాల కోసం మరికొంత మంది స్థానిక నాయకులు బీఆర్ఎస్ విడిచి వెళ్ళారట.
మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్ రావు మీదున్న వ్యతిరేకతతో కొందరు కాంగ్రెస్ గూటికి చేరినట్టు తెలిసింది.ఇది ఇంకా ఎక్కువైతే ఇబ్బందులు వస్తాయని గ్రహించిన అధినాయకత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టిందంటున్నారు. అందులో భాగంగానే తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విటల్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సుమన్, స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు తో కలిసి అరవింద్ రెడ్డి ఇంట్లో చర్చలు జరిపారు. అరవింద్ రెడ్డి వెనక్కి తగ్గడంతో పాటు దివాకర్ రావు గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. మొత్తం మీద మంచిర్యాల జిల్లాలో అసంతృప్త నేతలు ఇద్దర్నీ సెట్ చేయగలిగామని అనుకుంటోంది బీఆర్ఎస్ అధిష్టానం. మరి పోలింగ్ నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!