హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ఎవర్ని నమ్ముకున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్లో ఈటల రాజేందర్ ఏక్ నిరంజన్గా మిగిలిపోయారా? ఇక చాలు అని బీజేపీ నేతలకు చెప్పేశారా? పోలింగ్కు మిగిలిన మూడు రోజులు ఆయన ఎవరిపై నమ్మకం ఉంచుతున్నారు? ఈటలలో వచ్చిన మార్పేంటి? లెట్స్ వాచ్..!
బీజేపీ వారిని సర్దుకోవాలని చెప్పారా?
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
హుజురాబాద్లో ఈ నెల 30 పోలింగ్. 72 గంటల ముందే ప్రచారానికి ఫుల్స్టాప్. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గమంతా కలియ తిరిగారు. ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చాక.. ఈటల నామినేషన్ వేశాక.. ప్రచారం స్పీడ్ పెంచాయి బీజేపీ శ్రేణులు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఇంఛార్జ్ తరుణ్చుగ్ మొదలుకొని కాషాయదండు మొత్తం అక్కడే తిష్ట వేసింది. బూత్ కమిటీలు.. ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడం వంటి సంప్రదాయ పద్ధతుల్లో బీజేపీ శ్రేణులు తిరిగేశాయి కూడా. ఇదంతా బాగానే ఉన్నా.. అభ్యర్థి ఈటల రాజేందర్లో ఎక్కడో అనుమానం వెంటాడినట్టు సమాచారం. అందుకే ప్రచారం ముగియగానే బీజేపీ వాళ్లను సర్దుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ 72 గంటలు సొంత కేడర్నే ఈటల నమ్ముకోనున్నారా?
పోలింగ్కు మిగిలి ఉన్న 72 గంటలు తానే చూసుకోవాలని ఈటల రాజేందర్ డిసైడ్ అయినట్టు సమాచారం. బూత్ కమిటీలు.. పార్టీ నేతలు చేసింది ఇక చాలు అని చెప్పేశారా? అయితే ఎందుకు అన్నదే ఇప్పుడు ప్రశ్న. తనది కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పుకొనే ఈటల రాజేందర్.. రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీలో చేరారు. సుదీర్ఘకాలం టీఆర్ఎస్లో ఉండటం వల్లో ఏమో బీజేపీలో చేరినా అక్కడ గాలి ఇంకా వంటబట్టలేని తెలుస్తోంది. తనకు రాజకీయంగా జీవన్మరణ సమస్యలాంటి హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ నేతలపై ఆధారపడితే మొదటికే మోసం వస్తుందని అనుకున్నారో ఏమో.. సొంత కేడర్ను నమ్ముకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రచారం ముగిసిన తర్వాత కీలకమైన ఈ కాలంలో బీజేపీని నమ్ముకుంటే నష్టం జరగొచ్చని ఆయన అనుమానించారేమో అని చర్చ జరుగుతోంది.
బీజేపీ అభ్యర్థిగా ఫోకస్ కావడానికి ఈటల ఉత్సాహం చూపించలేదా?
హుజురాబాద్లో మొదటి నుంచి ఈటల రాజేందర్ సెంటిమెంట్ను నమ్ముకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్పైనే ఎక్కువ విశ్వాసం ఉంచారట. ఈ ఉపఎన్నికలో మొదటి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంటే ఈటల రాజేందర్గానే ఫోకస్ కావడానికి ప్రాధాన్యం ఇచ్చారు మాజీ మంత్రి. ఉపపోరు ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా వేడి కొనసాగించేందుకు ఆయన అనుచరులు మొగ్గు చూపారు. పైగా ప్రచారం ముగిశాక.. పోలింగ్ మొదలయ్యే వరకు డబ్బుల పంపిణీని కీలకంగా భావిస్తారు. ఈ అంశంలోనూ పార్టీ వారిని కాకుండా సొంతవారిపైనే ఈటల ఎక్కువ నమ్మకం ఉంచినట్టు టాక్. ఉపఎన్నిక ప్రచారం ఎంత గ్రాండ్గా ముగించినా.. చివరిక్షణంలో మాత్రం ఈటల ఏక్నిరంజన్గా మారినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఈటల తీసుకున్న ఈ జాగ్రత్త పోలింగ్ వరకేనా.. ఆ తర్వాత కూడా కొనసాగిస్తారా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!