Husnabad Congress : ఆ మాజీ ఎమ్మెల్యే చేరికతో రాజుకున్న చిచ్చు సెగలు రేపుతోందా.? లోకల్ లీడర్లు విడిపోయారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husnabad Congress :
ఆ మాజీ ఎమ్మెల్యే చేరికతో రాజుకున్న చిచ్చు సెగలు రేపుతోందా? తాడో పేడో తేల్చుకోవాలని చూస్తోంది ఎవరు? లోకల్ లీడర్లు సామాజికవర్గాలుగా విడిపోయారా? ఎవరా నేతలు.. ఏమా పార్టీ? ఏంటా నియోజకవర్గం? లెట్స్ వాచ్..!
Also Read
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ అగ్గి రాజేస్తుంది. కొంతకాలంగా టి ఆర్ యస్ లో సైలెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే అరిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జన్ ఖార్గే సమక్షంలో ఘర్ వాపసీ అయ్యారు. ఆ సమయంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సమన్వయ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ అక్కడే ఉన్నారు. దీంతో హుస్నాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పరిస్థితి ఎంటనే ప్రశ్న జోరందుకుంది.
ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరిగిన సమయంలోనే హుస్నాబాద్లో కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక సమావేశం పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏకంగా తీర్మానం చేశారు. స్థానిక నేతలకు.. జిల్లా నాయకత్వానికి తెలియకుండా ప్రవీణ్ రెడ్డి ని ఎలా చేర్చుకుంటారని విమర్శలు గుప్పించారు కొందరు. తాజా పరిణామాలతో అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు నేతలంతా సిద్ధం అవుతున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు రెడ్డి సామాజికవర్గ నేతల అండతోనే ప్రవీణ్రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారని ప్రచారం జరుగుతోంది.
హుస్నాబాద్ కాంగ్రెస్లోని బీసీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు సమాచారం. బీసీ నేతలను పక్కన పెట్టేందుకే ప్రవీణ్రెడ్డిని తీసుకొచ్చారని ఫైర్ అవుతున్నారట. 50 ఏళ్లుగా బొమ్మ కుటుంబం కాంగ్రెస్ కోసం పనిచేస్తోందని.. ఆ కుటుంబానికి చెందిన శ్రీరామ్ చక్రవర్తికి మెండిచెయ్యి ఇచ్చేలా చేస్తున్నారని అనుమానిస్తున్నారట. వారంతా సహాయ నిరాకరణకు యోచిస్తున్నట్టు సమాచారం.
నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న బొమ్మ శ్రీరామ్ కు టికెట్పై స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసారట. ప్రవీణ్ రెడ్డి మాత్రం టికెట్ హామీతోనే కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం హుస్నాబాద్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు జంప్ చేస్తారో అర్థంకాని పరిస్థితి ఉందట. రానున్న రోజుల్లో కీలక పరిణామాలు తప్పవని అనుకుంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!