WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • konaseema
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Off The Record Grandhi Team Is Serious On High Command

గ్రంధికి దక్కని చోటు..హై కమాండ్ పై గ్రంధి వర్గం గరం గరం

Published Date - 12:16 PM, Sat - 14 May 22
By Sista Madhuri
గ్రంధికి దక్కని చోటు..హై కమాండ్ పై గ్రంధి వర్గం గరం గరం

మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కకనినేతల అసంతృప్తి ఇంకా చల్లారినట్టు కనిపంచడంలేదు.. ముఖ్యంగా పశ్చిమగోదావరిజిల్లా నేతల్లో అసంతృప్తి సెగ పొగలుగక్కుతోంది. చాపకింద నీరులా వ్యాపించి ఓట్లేసిన జనంలో దృష్టిలో చులకన చేస్తోంది. తాజాగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యవహరంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. భీమవరంలో వైసీపీ జిల్లా పార్టీ మీటింగ్ రసాభాసగా మారడం మంత్రి వర్గవిస్తరణలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు చోటు దక్కకపోవడం ఎంతటి అసంతృప్తిని మిగిల్చిందో బయటపెట్టింది. పార్టీని మరింత బలోపేతం చేద్దామని చెప్పడానికి వచ్చిన నేతల ఎదుటే మంత్రి వర్గవిస్తరణలో తమ నేతకు ప్రాధాన్యత కల్పించలేదని కేడర్‌ ఎదురు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద పోటిచేసి ఘనవిజయం సాధించడం, పైగా సీనియర్ ఎమ్మెల్యే అయిన గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి వర్గవిస్తరణలో ఎందుకు స్థానం కల్పించలేదంటూ ఆయన అనుచరగణం ఆగ్రహించింది. పార్టీ ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ లు, ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, తాజాగా మంత్రి పదవులు దక్కించుకున్న కొట్టు సత్యనారాయణ, కారుమూరిల ముందే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వర్గం తమ నేతకు అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు. భీమవరంలో ఉన్న వైసిపి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విలువ లేదని అందుకే తమ ఎమ్మెల్యేని అధినేత సైతం పట్టించుకోలేదని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసారు. మంత్రి పదవి విషయంలోనూ అన్యాయం చేశారని పార్టీ పెద్దలను ఘోరావ్ చేసారు. దీంతో అవాక్కైన పార్టీ పెద్దలు, మంత్రులు గ్రంధి వర్గానికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది.

2019 ఎన్నికలు ఫలితాలు ప్రకటించిన వెంటనే భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఖాయమంటూ చర్చలమీద చర్చలు జరిగాయి. అప్పుడు మంత్రి పదవి దక్కకపోయినా అక్కడి నేతల్లో ఆత్మస్థైర్యం ఏమాత్రం తగ్గలేదు. మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరిగినపుడు అవకాశం ఉంటుందని అంతా ఎదురుచూసారు. తీరా అందులోనూ అవకాశం రాకపోవడంతో ఎమ్మెల్యే వర్గంలో అసంతృప్తి మరింత ఎక్కువయ్యింది. గ్రంథికి మంత్రి పదవి రాలేదని ఆగ్రహంతో ఉన్న కేడర్‌ అగ్రనేతలంతా రాగానే భగ్గుమన్నారు. మంత్రి వర్గ విస్తరణలో తమ నేతకు అవకాశం కల్పించకపోవడం కనీసం అధినేతను కలిసేందుకు అవకాశం కల్పించకపోవడం భీమవరం నేతల్లో కాకరేపిందట.. తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం అధినేత దృష్టిలో తనకున్న స్థానమేంటో మీరే నేరుగా తేల్చండంటూ పార్టీ వర్గాలకు సూచనలు చేసారట.

అయితే గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కకపోవడం వెనుక కారణాలు అనేకం ఉన్నాయట.. భీమవరం అసెంబ్లీ ప్రాంతానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు ఇపుడు ఏపి శాశనమండలి చైర్మెన్ గా ఉన్నారు. మోషెన్ రాజుకు గ్రంధి శ్రీనివాస్ కు మద్య కొంత గ్యాప్ ఉండటం, తరచూ ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడం అదే సమయంలో భీమవరంలో కీలకంగా నీలిచే క్షత్రియ సామజికవర్గంతో గ్రంథికి విభేదాలు ఉండటం మరోకారణమట. ఇదే సమయంలో క్షత్రియ సామాజికి వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాధరాజును పక్కనబెట్టి గ్రంధికి అవకాశమివ్వడం సరికాదని సొంతపార్టీ నేతలే చెప్పుకొచ్చారట. మరోపక్క పక్కపార్టీ అధినేతల ఓడించడం ఎంత అవసరమో అదే సమయంలో సొంతపార్టీ నేతలతో సఖ్యతగా ఉండాలనే మాటను వైసిపి అధినేత భీమవరం ఎమ్మెల్యే గ్రంధికి మంత్రి పదవి ఇవ్వకుండా చెప్పకనే చెప్పారని ఇతర నియోజకవర్గ నేతల మాట. ఇదంతా ఇలా ఉంటే పార్టీలో ఉన్న అసంతృప్తి, వర్గవిభేదాలు వచ్చే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో అనే చర్చకూడా ఇపుడు భీమవరంలో హాట్ టాపిక్..

  • Tags
  • ap politics
  • Bhimavaram
  • jana sena
  • MLA Grandhi Srinivas
  • ycp

RELATED ARTICLES

Mahanadu 2022: పొత్తుల ఊసే లేకుండా టీడీపీ తీర్మానం

LIVE : YCP MLA Kodali Nani Fires on Chandrababu

Kuna Ravi: తమ్మినేని కామెంట్లపై కూన రవి ఫైర్

Pawan Kalyan : ఆయన పొత్తులకు సిద్ధం అవుతున్నారా..? కానీ మెగా ఫాన్స్ ఆయన్నే సీఎం చేస్తారా..?

YCP : ఆయన లేనిదే అడుగు కూడా వేసేవారు కాదట..! ఇంతకీ ఎవరాయన..?

తాజావార్తలు

  • అబ్బాయిలూ.. శృంగారంలో అమ్మాయిని రెచ్చగొట్టాలా.. ఇవి ట్రై చేయండి

  • NO Purchase Day : కేంద్రం తీరుపై పెట్రోల్ డీల‌ర్ల నిరసన

  • Revathy: తొలిసారి ఉత్తమనటిగా కేరళ స్టేట్ అవార్డ్ అందుకున్న సీనియర్ నటి!

  • Super Star Krishna: ఆ మాట అన్నానని మహేష్ స్టూడియో అంతా పరిగెత్తించాడు

  • Petrol Rates: సమస్యలు పరిష్కరించాలని మే31న నో పర్ఛేజ్ డే

ట్రెండింగ్‌

  • Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

  • Viral Video: ప్యాంట్ ఊడింది.. పరువు పోయింది

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions