టీడీపీలోకి మాజీ మంత్రి రావెల రీఎంట్రీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రత్తిపాడులో టీడీపీకి ఇంఛార్జ్ కరువు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఐదు ఎన్నికల్లో టీడీపీ నుంచి మాకినేని పెదరత్తయ్య గెలిచారు. 2009లో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన మేకతోటి సుచరిత ఉన్నారు. టీడీపీ ఓడినా ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. నియోజకవర్గంలోని కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో తమ్ముళ్లదే హవా. ప్రత్తిపాడు మండలంలో వైసీపీ నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది. గుంటూరు రూరల్లోనే టీడీపీ బలహీనం. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్.. తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రత్తిపాడు టీడీపీ నాయకుడి లేని నియోజకవర్గంగా మారిపోయింది.
ఇంఛార్జ్ నియామకంపై టీడీపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎంపిక కొలిక్కి రావడం లేదట. దీంతో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యను సమన్వయకర్తగా నియమించారు. అయితే ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ముందుగానే ఇంఛార్జ్ను నియమిస్తే ఎన్నికల నాటికి పార్టీ బలం పుంజుకుంటుందనేది కేడర్ వాదన. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంఛార్జ్ లేకపోయినా కార్యకర్తలు వైసీపీకి గట్టిపోటీనే ఇచ్చారు. గతంలో ప్రత్తిపాడులో పోటీ చేసిన కందుకూరి వీరయ్య పేరుపై చర్చ జరిగిందట. అయితే వీరయ్య తన ఆర్ధిక పరిస్థితి గురించి నాయకులకు చెప్పినట్టు సమాచారం. పార్టీ సహకరిస్తే పోటీ చెయ్యడానికి సిద్దమని ఆయన చెప్పారట.
Also Read
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Off The Record: రొటీన్కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
రావెల మళ్లీ టీడీపీలోకి వస్తారని ప్రచారం చంద్రబాబుతో రావెల భేటీ?2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా చేసిన రావెల కిశోర్బాబు పేరు సడెన్గా పార్టీలో చర్చకు వస్తోంది. గతంలో జిల్లా టీడీపీ నేతలతో విబేధాలు రావడంతో ఆయన టీడీపీకి గుడ్బై చెప్పి జనసేనలో చేరారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ కండువా కప్పుకొన్నారు. అయితే రావెల మళ్లీ టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జోరందకుంది. కొంతమంది టీడీపీ నేతలతో రావెల టచ్లో ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గంలోని కొందరు మండలస్థాయి టీడీపీ నేతలు కూడా రావెల రీఎంట్రీకి సానుకూలంగా ఉన్నారట. వ్యతిరేకత కూడా ఉందట. ఇదే సమయంలో చంద్రబాబుతో రావెల భేటీ అయినట్టు ప్రచారం గుప్పుమంది. ప్రత్తిపాడు నేతలు రావెల విషయాన్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన చూద్దామని సమాధానం ఇచ్చారట. రావెల రీఎంట్రీ ఖాయమైతే ఆయనే ప్రత్తిపాడు ఇంఛార్జ్గా రావొచ్చని చెవులు కొరుక్కుంటున్నారట తమ్ముళ్లు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!