Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record East Godavari Telugu Desam Party Politics

East Godavari Telugu Desam Party Politics : ఆ ఉమ్మడి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడుతున్నారా..?

Published Date :July 25, 2022 , 11:36 am
By Premchand Chowdary
East Godavari Telugu Desam Party Politics : ఆ ఉమ్మడి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడుతున్నారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

East Godavari Telugu Desam Party Politics  : ఆ ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ స్థానాలను పసుపుపార్టీ లైట్ తీసుకుందా..? మూడేళ్లుగా అదే స్పేస్ కంటిన్యూ అవుతోందా..? అధిష్ఠానం నాన్చివేతకు తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడుతున్నారా? ఇంతకీ ఏంటా నియోజకవర్గాలు? లెట్స్‌ వాచ్‌..!

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ఉమ్మడి తూర్పుగోదావరి చాలా కీలకం. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చిన వారు అధికారం కైవశం చేసుకుంటారు అనేది ఒక సెంటిమెంట్. జిల్లాలో మొత్తం మూడు పార్లమెంటు నియోజకవర్గాలు 19 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ టిడిపి ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. రాజకీయ ఎత్తుగడలతో రెండుచోట్ల పోటీ చేసిన వారు పార్టీ దూరం అయ్యారు. కాకినాడ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ వైసీపీ కండువా కప్పేసుకున్నారు. రాజమండ్రి బరిలో నిలిచిన మాగంటి రూప ఆ తర్వాత అడ్రస్ లేరన్నది తెలుగు తమ్ముళ్ల మాట. అమలాపురంలో బాలయోగి కుమారుడు హరీష్‌ ఓడిన తర్వాత నియోజకవర్గానికి రావడం లేదట. వచ్చినా అమలాపురం గడప దాటి వెళ్లడం లేదన్నది కేడర్‌ చెప్పేమాట. ఎక్కువగా వైజాగ్‌లోనే ఉంటున్నారట హరీష్‌.

Also Read

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?
  • Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
  • Off The Record : కాంగ్రెస్ హనుమంతుడికి పవర్ సంజీవని దొరకదా..?

రాజమండ్రిలో ఓడిన తర్వాత మాగంటి రూప సైతం ఇటు రాలేదట. ఇటీవల కాలంలో ఆమె మామ మురళీమోహన్‌ చేస్తున్న కామెంట్స్‌తో.. ఆ కుటుంబం క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తుందా లేదో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. అసలు నాయకులకే లేనప్పుడు మనకెందుకు అని టీడీపీ కేడర్‌ సైతం జెండా పక్కన పడేసింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అభ్యర్థుల బలాబలాలపై చర్చ నడుస్తోంది. అయితే ఈ మూడు లోక్‌సభ అభ్యర్థులపై టీడీపీ సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. చూద్దాం.. చేద్దాం.. అనే మాటలే వినిపిస్తున్నాయట.

గత నెలలో జరిగిన టిడిపి రాష్ట్రస్థాయి సమావేశాల్లో జిల్లాకు చెందిన నేతలు అభ్యర్థుల అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. ఇప్పటి నుంచే ఎస్టాబ్లిష్ కాకపోతే తర్వాత ఇబ్బందులు వస్తాయని డైరెక్ట్‌గానే చెప్పేశారట. అయితే అభ్యర్థుల ఎంపిక ఆషామాషీ కాదని.. ఆర్ధిక అంగ బలాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బదులిచ్చారట చంద్రబాబు. ఆ సమాధానం రుచించలేదట నాయకులకు. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల ఇంఛార్జులు.. ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారని ప్రశ్నిస్తున్నారట. అధికార పార్టీ క్లారిటీగా దూసుకుపోతుంటే.. ఇంకా పాత పద్ధతులేంటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారట నాయకులు.

రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు లోక్‌సభ అభ్యర్థి ప్రభావం కచ్చితంగా తమపై ఉంటుందని నేతలు చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడలో 25 వేలు.. అమలాపురంలో 45 వేలు ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. అప్పుడు కూడా చివరి వరకు నాన్చడం వల్లే నష్టపోయామన్నది టీడీపీ నేతల చెప్పే మాట. క్లారిటీ లేక క్రాస్ ఓటింగ్ జరిగిందనేది వారి అభిప్రాయం. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో పసుపు పార్టీకి ప్రణాళిక లేదనే టాక్ నడుస్తుంది. అయ్యవారు వచ్చేలోపు ఉన్నవాళ్లు చేజారే ప్రమాదం ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ ఎపిసోడ్ కి టీడీపీ అధిష్ఠానం ఏవిధంగా ఎండ్‌కార్డ్ వేస్తుందో చూడాలి.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amalapuram
  • chalamalasetty sunil
  • east godavari
  • Harish
  • Maganti Roopa

తాజావార్తలు

  • Faria Abdullah: అతని కోసమె నేను ఇండస్ట్రీలోకి వచ్చాను.. అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!

  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!

  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

  • Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions