East Godavari Telugu Desam Party Politics : ఆ ఉమ్మడి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడుతున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
East Godavari Telugu Desam Party Politics : ఆ ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ స్థానాలను పసుపుపార్టీ లైట్ తీసుకుందా..? మూడేళ్లుగా అదే స్పేస్ కంటిన్యూ అవుతోందా..? అధిష్ఠానం నాన్చివేతకు తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడుతున్నారా? ఇంతకీ ఏంటా నియోజకవర్గాలు? లెట్స్ వాచ్..!
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ఉమ్మడి తూర్పుగోదావరి చాలా కీలకం. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చిన వారు అధికారం కైవశం చేసుకుంటారు అనేది ఒక సెంటిమెంట్. జిల్లాలో మొత్తం మూడు పార్లమెంటు నియోజకవర్గాలు 19 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో మూడు లోక్సభ నియోజకవర్గాల్లోనూ టిడిపి ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. రాజకీయ ఎత్తుగడలతో రెండుచోట్ల పోటీ చేసిన వారు పార్టీ దూరం అయ్యారు. కాకినాడ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ వైసీపీ కండువా కప్పేసుకున్నారు. రాజమండ్రి బరిలో నిలిచిన మాగంటి రూప ఆ తర్వాత అడ్రస్ లేరన్నది తెలుగు తమ్ముళ్ల మాట. అమలాపురంలో బాలయోగి కుమారుడు హరీష్ ఓడిన తర్వాత నియోజకవర్గానికి రావడం లేదట. వచ్చినా అమలాపురం గడప దాటి వెళ్లడం లేదన్నది కేడర్ చెప్పేమాట. ఎక్కువగా వైజాగ్లోనే ఉంటున్నారట హరీష్.
Also Read
రాజమండ్రిలో ఓడిన తర్వాత మాగంటి రూప సైతం ఇటు రాలేదట. ఇటీవల కాలంలో ఆమె మామ మురళీమోహన్ చేస్తున్న కామెంట్స్తో.. ఆ కుటుంబం క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తుందా లేదో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. అసలు నాయకులకే లేనప్పుడు మనకెందుకు అని టీడీపీ కేడర్ సైతం జెండా పక్కన పడేసింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అభ్యర్థుల బలాబలాలపై చర్చ నడుస్తోంది. అయితే ఈ మూడు లోక్సభ అభ్యర్థులపై టీడీపీ సీరియస్గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. చూద్దాం.. చేద్దాం.. అనే మాటలే వినిపిస్తున్నాయట.
గత నెలలో జరిగిన టిడిపి రాష్ట్రస్థాయి సమావేశాల్లో జిల్లాకు చెందిన నేతలు అభ్యర్థుల అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. ఇప్పటి నుంచే ఎస్టాబ్లిష్ కాకపోతే తర్వాత ఇబ్బందులు వస్తాయని డైరెక్ట్గానే చెప్పేశారట. అయితే అభ్యర్థుల ఎంపిక ఆషామాషీ కాదని.. ఆర్ధిక అంగ బలాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బదులిచ్చారట చంద్రబాబు. ఆ సమాధానం రుచించలేదట నాయకులకు. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల ఇంఛార్జులు.. ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారని ప్రశ్నిస్తున్నారట. అధికార పార్టీ క్లారిటీగా దూసుకుపోతుంటే.. ఇంకా పాత పద్ధతులేంటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారట నాయకులు.
రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు లోక్సభ అభ్యర్థి ప్రభావం కచ్చితంగా తమపై ఉంటుందని నేతలు చెబుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో కాకినాడలో 25 వేలు.. అమలాపురంలో 45 వేలు ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. అప్పుడు కూడా చివరి వరకు నాన్చడం వల్లే నష్టపోయామన్నది టీడీపీ నేతల చెప్పే మాట. క్లారిటీ లేక క్రాస్ ఓటింగ్ జరిగిందనేది వారి అభిప్రాయం. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో పసుపు పార్టీకి ప్రణాళిక లేదనే టాక్ నడుస్తుంది. అయ్యవారు వచ్చేలోపు ఉన్నవాళ్లు చేజారే ప్రమాదం ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ ఎపిసోడ్ కి టీడీపీ అధిష్ఠానం ఏవిధంగా ఎండ్కార్డ్ వేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..