Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Dl Ravindra Reddy Participating In 2024 Elections

2024 ఎన్నికల్లో పోటీ చేస్తానన్న డీఎల్ రవీంద్రారెడ్డి..!

Published Date :October 19, 2021 , 10:31 pm
By Manohar
2024 ఎన్నికల్లో పోటీ చేస్తానన్న డీఎల్ రవీంద్రారెడ్డి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి ట్రిపుల్‌రెడ్డి దారెటు? రెండు దఫాలుగా ఎన్నికలకు దూరంగా ఉంటున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎందుకు బరిలో దిగాలని అనుకుంటున్నారు? ఏ పార్టీనో స్పష్టత ఇవ్వకుండా గాలివాటాన్ని నమ్ముకున్నారా? ఇంతకీ ఎవరా ట్రిపుల్‌రెడ్డి?

2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని డీఎల్‌ ప్రకటన..!

దాదాపు నాలుగు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగి.. సడెన్‌గా పాలిటిక్స్‌ వద్దని అనుకుని 2014 ఎన్నికల్లో సైలెంట్‌ అయ్యారు మాజీమంత్రి దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి రవీంద్రారెడ్డి. ఇంటి పేరును కలిపి ఇలా మొత్తంగా చెబితే పెద్దగా గుర్తుపట్టలేరు కానీ.. DL రవీంద్రారెడ్డి అంటే మాత్రం ఠక్కున అందరి నోళ్లలో నానుతారు ఈ మాజీ మంత్రి. పేరులో మూడు రెడ్డిలు ఉండటంతో సన్నిహితులు మాత్రం ఆయన్ని ట్రిపుల్‌రెడ్డి అని అంటుంటారు. రాజకీయంగా దాదాపుగా తెరమరుగైన రవీంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించి వైసీపీ, టీడీపీ శిబిరాల్లో వేడి పుట్టించారు. కడపతోపాటు…మైదుకూరు రాజకీయాల్లో చర్చగా మారారు DL.

కిరణ్‌కుమార్‌రెడ్డి సమయంలో కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌..!

1978లో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన DL.. తర్వాత హస్తం గుర్తుపై మరో ఐదుసార్లు గెలిచారు. ఎవరితోనూ పెద్దగా అడ్జస్ట్‌ కారనే ముద్ర ఉంది. అదే ఆయనకు మైనస్‌ అంటారు సన్నిహితులు. డీఎల్‌ను వైఎస్‌ కేబినెట్‌లోకి తీసుకోకపోవడానికి అదే కారణంగా చెబుతారు మరికొందరు. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌ సీఎం కావాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆపై నల్లారి కేబినెట్‌లో చేరి.. కిరణ్‌కుమార్‌రెడ్డినే బహిరంగంగా విమర్శించారు. అప్పట్లో DL తీరు పెద్ద సంచలనం. విదేశీ పర్యటనలో ఉండగానే అవమానకర రీతిలో మంత్రిపదవి నుంచి బర్తరఫ్‌ అయ్యారు రవీంద్రారెడ్డి.

వైసీపీలో అనుచరులకు ప్రాధాన్యం లేదని కుతకుత..!
సొంత మండలంలో ఆలయ ఛైర్మన్‌ పదవి అనుచరులకు ఇవ్వలేదట..!

2014లో టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు మద్దతు తెలిపారు DL. తన అనుయాయులకు పుట్టా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో 2019 ఎన్నికల్లో మైదుకూరు నడిరోడ్డులో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. సుదీర్ఘకాలం శెట్టిపల్లి కుటుంబంతో వైరం సాగినా.. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శెట్టిపెల్లి రఘురామిరెడ్డికి మద్దతు తెలిపారు రవీంద్రారెడ్డి. వైసీపీలో కూడా తన అనుచరులకు గుర్తింపు లభించడం లేదని మాజీ మంత్రి కుతకుతలాడుతున్నట్టు సమాచారం. రవీంద్రారెడ్డి సొంత మండలం కాజీపేటలో నాగ నాదేశ్వరకోన ఆలయానికి పాటుపడుతున్న గంగవరం ఆదినారాయణరెడ్డి వంశీయులను ఎమ్మెల్యే పక్కన పెట్టారట. ఆలయానికి సంబంధంలేని వారిని ఛైర్మన్‌గా నియమించడంతో డీఎల్‌ మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. తన అనుచరులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుని.. ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారని డీఎల్‌ మండిపడుతున్నారట. అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారని సమాచారం.

2024లో ఏ పార్టీ నుంచి బరిలో దిగేదీ స్పష్టత ఇవ్వలేదు..!

వైసీపీలో ఉంటూనే ప్రభుత్వ పాలనపై.. పాలకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రవీంద్రారెడ్డి. వైసీపీలో కొనసాగే ఆలోచన ఉంటే.. ఈ స్థాయిలో కామెంట్స్‌ ఎందుకు చేశారన్నది ప్రశ్న. పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా భావించేవాళ్లూ ఉన్నారు. అయితే 2024లో ఏ పార్టీ నుంచి బరిలో దిగేదీ స్పష్టత ఇవ్వలేదు. మైదుకూరులో వైసీపీ సీటు ఖాళీ లేదు. టీడీపీ నుంచి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఉన్నారు. మిగిలింది బీజేపీ, జనసేన. మరి ఈ రెండు పార్టీలలో ఒకదానిని ఎంచుకుంటారో లేక.. ఇండిపెండెంట్‌గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన డీఎల్‌ మళ్లీ ఇండిపెండెంట్‌గానే బరిలో దిగుతారో తెలియదు. అప్పటికి ప్రజల మూడు ఎలా ఉంటే.. అలా గాలివాటంగా వెళ్లాలని అనుకుంటున్నట్టు ఆయన మాటలబట్టి తెలుస్తోంది. మరి.. ఆయన దారెటో ఏంటో.. రాజకీయంగా మళ్లీ సత్తా చాటుతారో లేదో కాలమే చెప్పాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2024 Elections
  • Andhra Pradesh
  • dl ravindra reddy

తాజావార్తలు

  • AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..

  • Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

  • Sangeeth Sobhan: నిహారిక లేకపోతే.. సంగీత్ శోభన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • US-Iran Talks: చర్చలకు ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్..

  • Niharika Konidela: డిస్ట్రిబ్యూటర్ల ఆనందమే అసలైన విజయం.. ప్రతీ ఒక్కరికీ థాంక్స్!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions