Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Conflicts That Turned The Ycp Into A Rival Within Itself

YCP : వైసీపీ స్వపక్షంలోనే వైరిపక్షంగా మారి ఘర్షణలు

Published Date :May 19, 2022 , 12:51 pm
By Premchand Chowdary
YCP :  వైసీపీ స్వపక్షంలోనే వైరిపక్షంగా మారి ఘర్షణలు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఈ మూడేళ్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వైసీపీ అంతర్గత కుమ్ములాటలతోనే కాలం గడిచిపోయింది. పార్టీ నేతలే కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం..కామన్‌గా మారింది. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిధార్థ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వర్గపోరు రక్తపోరుగా మారడానికి గీతలేవీ లేవు. సమయం సందర్భం వస్తే వైరిపక్షాలుగా మారి ఘర్షణ పడుతుంటారు.

నందికొట్కూరు వైసీపీలో విభేదాలను పరిష్కరించడానికి గతంలో పార్టీ పెద్దలు విఫలయత్నం చేశారు. ఈ దఫా మాత్రం కాస్త గట్టిగానే ఫోకస్‌ పెట్టారట. ఆర్థర్, సిద్దార్థరెడ్డి గ్రూపులను కలిపేందుకు పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫీల్డ్‌ ఎంట్రీ ఇచ్చారట. ఈ టీమ్‌లో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఉన్నారట. ఎమ్మెల్యే ఆర్థర్‌ను, సిద్దార్థరెడ్డిని తాడేపల్లికి పిలిచి గట్టిగానే క్లాస్‌ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం ఇద్దరూ కలిసి పనిచేయాలని కాస్త కఠినంగా చెప్పారట. గడప గడపకు మన ప్రభుత్వంలోనూ ఐక్యంగా పనిచేయాలని సూచించారట. ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటే కేడర్‌ ఇబ్బంది పడుతోందని.. చివరగా పార్టీకి నష్టం జరుగుతోందని తలంటారట పార్టీ పెద్దలు. ఆ సమయంలోనూ ఆర్థర్‌, సిద్ధార్థరెడ్డిలు ఎవరి వాదన వారు వినిపించారట.

Also Read

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Add as a preferred
source on google

ఇక కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మధ్య ఏమాత్రం పోసగడం లేదు. ఇక్కడ కూడా పరస్పరం కేసులు పెట్టుకున్నారు. బహిరంగ వేధికలపైనే పరస్పరం విమర్శలు హీటెక్కుతున్నాయి. ఈ గొడవల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి, ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కోల్పోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో గడప గడప కార్యక్రమంలోను ఎమ్మెల్యే సుధాకర్‌కు నిరసనలు తప్పడం లేదు. అందుకే సుధాకర్‌, హర్షలను తాడేపల్లికి పిలిపించి చర్చించారట. మంత్రులు బుగ్గన, అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే కాటసానిల సమక్షంలోనే కోడుమూరు పంచాయితీ జరిగిందట.
ఇక్కడ కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం. టీడీపీని ప్రోత్సహిస్తున్నారని ఒకరిపై.. కేసులు పెడుతున్నారని మరొకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతా విన్న తర్వాత ఇకపై గొడవలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారట పార్టీ పెద్దలు.

మొత్తానికి నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వివాదాలపై సర్దుబాటు చేసినా ఆయా గ్రూపులు కలిసి పనిచేస్తాయా అనేది పెద్ద ప్రశ్న. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదని గుర్తు చేస్తున్నారు. అయితే ఇపుడు కూడా కలిసి పనిచేయకపోతే అధిష్ఠానం గట్టిగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. ఎట్టకేలకు ఎమ్మెల్యే ఆర్థర్‌, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు.. ఎమ్మెల్యే సుధాకర్‌, కోట్ల హర్షలు కలిసి ఫొటోలు దిగి.. ఇకపై ఐక్యంగా ఉంటామని కేడర్‌కు మెజేస్‌లు చెప్పారట. మరి.. చేతులు కలిసినట్టే.. నేతల చేతలు కూడా కలుస్తాయో లేదో చూడాలి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap politics
  • Nandikotkur
  • tdp
  • ycp

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions