YCP : వైసీపీ స్వపక్షంలోనే వైరిపక్షంగా మారి ఘర్షణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఈ మూడేళ్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వైసీపీ అంతర్గత కుమ్ములాటలతోనే కాలం గడిచిపోయింది. పార్టీ నేతలే కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం..కామన్గా మారింది. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిధార్థ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వర్గపోరు రక్తపోరుగా మారడానికి గీతలేవీ లేవు. సమయం సందర్భం వస్తే వైరిపక్షాలుగా మారి ఘర్షణ పడుతుంటారు.
నందికొట్కూరు వైసీపీలో విభేదాలను పరిష్కరించడానికి గతంలో పార్టీ పెద్దలు విఫలయత్నం చేశారు. ఈ దఫా మాత్రం కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టారట. ఆర్థర్, సిద్దార్థరెడ్డి గ్రూపులను కలిపేందుకు పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చారట. ఈ టీమ్లో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అంజాద్ బాషా, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఉన్నారట. ఎమ్మెల్యే ఆర్థర్ను, సిద్దార్థరెడ్డిని తాడేపల్లికి పిలిచి గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం ఇద్దరూ కలిసి పనిచేయాలని కాస్త కఠినంగా చెప్పారట. గడప గడపకు మన ప్రభుత్వంలోనూ ఐక్యంగా పనిచేయాలని సూచించారట. ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటే కేడర్ ఇబ్బంది పడుతోందని.. చివరగా పార్టీకి నష్టం జరుగుతోందని తలంటారట పార్టీ పెద్దలు. ఆ సమయంలోనూ ఆర్థర్, సిద్ధార్థరెడ్డిలు ఎవరి వాదన వారు వినిపించారట.
Also Read
ఇక కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మధ్య ఏమాత్రం పోసగడం లేదు. ఇక్కడ కూడా పరస్పరం కేసులు పెట్టుకున్నారు. బహిరంగ వేధికలపైనే పరస్పరం విమర్శలు హీటెక్కుతున్నాయి. ఈ గొడవల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి, ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కోల్పోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో గడప గడప కార్యక్రమంలోను ఎమ్మెల్యే సుధాకర్కు నిరసనలు తప్పడం లేదు. అందుకే సుధాకర్, హర్షలను తాడేపల్లికి పిలిపించి చర్చించారట. మంత్రులు బుగ్గన, అంజాద్ బాషా, ఎమ్మెల్యే కాటసానిల సమక్షంలోనే కోడుమూరు పంచాయితీ జరిగిందట.
ఇక్కడ కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం. టీడీపీని ప్రోత్సహిస్తున్నారని ఒకరిపై.. కేసులు పెడుతున్నారని మరొకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతా విన్న తర్వాత ఇకపై గొడవలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారట పార్టీ పెద్దలు.
మొత్తానికి నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వివాదాలపై సర్దుబాటు చేసినా ఆయా గ్రూపులు కలిసి పనిచేస్తాయా అనేది పెద్ద ప్రశ్న. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదని గుర్తు చేస్తున్నారు. అయితే ఇపుడు కూడా కలిసి పనిచేయకపోతే అధిష్ఠానం గట్టిగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. ఎట్టకేలకు ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు.. ఎమ్మెల్యే సుధాకర్, కోట్ల హర్షలు కలిసి ఫొటోలు దిగి.. ఇకపై ఐక్యంగా ఉంటామని కేడర్కు మెజేస్లు చెప్పారట. మరి.. చేతులు కలిసినట్టే.. నేతల చేతలు కూడా కలుస్తాయో లేదో చూడాలి.
- Tags
- ap politics
- Nandikotkur
- tdp
- ycp
తాజావార్తలు
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..