తెలంగాణలో ప్లాన్ మార్చిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇతర పార్టీ నేతలను ఆకర్షించే విషయంలో బీజేపీ ప్లాన్ మారిందా? ఇందుకోసం ఇద్దరు నాయకులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారా? బీజేపీని వీడి వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి తీసుకొస్తారా? కాషాయ శిబిరం వ్యూహం ఏంటి?
రెండో దశ చేరికలకు బీజేపీ తలుపులు తెరిచిందా?
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
బీజేపీలో చేరికలపై తెలంగాణలో మళ్లీ చర్చ మొదలైంది. అప్పట్లో కీలక నాయకులతో వరసగా మంతనాలు సాగించి.. కొందరిని తమ పార్టీలో చేర్చుకున్నారు కమలనాథులు. మధ్యలో ఈ ప్రక్రియకు బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ గాడిలో పెట్టింది బీజేపీ. ముఖ్యంగా హుజురాబాద్ ఉపఎన్నికలో గెలిచాక రెండో దశ చేరికలు మొదలుపెట్టినట్టు చర్చ జరుగుతోంది.
కిందిస్థాయిలోనూ చేరికలకు ఊతం..!
కాంగ్రెస్, టీఆర్ఎస్లకు చెందిన రెండు డజన్ల నేతలు తమతో టచ్లో ఉన్నారని.. ఆ మధ్య బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్చుగ్ తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేరికల గురించి మాట్లాడారు. కేవలం ఎమ్మెల్యేలు.. ఎంపీలు చేరితేనే చేరినట్లు కాదని.. జిల్లా స్థాయిలో కాషాయ కండువా కప్పుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారాయన. దీంతో వివిధ పార్టీలకు చెందిన పెద్ద లీడర్లే కాకుండా.. చోటామోటా నాయకులను కూడా బీజేపీలోకి ఆహ్వానించాలనే ఆలోచనకు వచ్చినట్టు కిషన్రెడ్డి మాటలను విన్నవారు చెబుతున్నారు. ఇకపై కిందిస్థాయిలో చేరికలు జోరందుకుంటాయని అనుకుంటున్నారు.
చేరికలపై ఈటల ఆలోచనలకు పెద్దలు గ్రీన్సిగ్నల్..!
బీజేపీ జిల్లా శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం.. బీజేపీలో చేరికలపై ప్రత్యేకంగా ప్రస్తావించారట. పార్టీని వదిలి వెళ్లిన వారిని సైతం తీసుకురావాలని సూచించారు. వారు ఇబ్బందులు పడ్డా.. ఒకనాడు భారత్మాతాకీ జై అన్నవారేనని తెలిపారు ఈటల. ఆయన కూడా జాయినింగ్స్పై కొంత శ్రద్ధ తీసుకోబోతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యమకారులను, అధికారపార్టీలో అసంతృప్తితో ఉన్నవాళ్లను.. టచ్లో ఉన్న వివిధ వర్గాల ప్రముఖులను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట. ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా ఈ విషయంలో ఈటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్న డీకే అరుణ..!
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సైతం గతంలోనే కొందరు కాంగ్రెస్ నేతలు.. మాజీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆపరేషన్ మధ్యలోనే ఆగింది. ఇప్పుడు డీకే అరుణ మళ్లీ తన పని మొదలుపెట్టినట్టు సమాచారం. మాటలు.. మంతనాలు.. మంత్రాంగాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యోగ సంఘాల మాజీ నేత విఠల్, జర్నలిస్ట్లు బీజేపీలో చేరిపోయారు. వారి చేరిక వెనక తాజా రాజకీయ పరిస్థితులు.. సామాజికవర్గాల ప్రభావం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మరి.. బీజేపీలో చేరికలు ఏ మేరకు ఉంటాయో.. ఎవరు చేరతారో.. చేరినవారు ఎంత వరకు ప్రభావం చూపిస్తారో కాలమే చెప్పాలి.
- Tags
- bjp
- off the record
- telanagna
- TRS
తాజావార్తలు
-
TMC crisis: టీఎంసీ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేల డుమ్మా.. మమతా పార్టీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం!
-
AP Weather Updates : బయట అడుగు పెడితే భగ్గుమంటోంది.. ఏపీలో రికార్డు వేడి.!
-
Tamil Cinema : కోలీవుడ్ కోసం విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. వాటన్నిటికి ఇక గ్రీన్ సిగ్నల్
-
CM Vijay: రైతన్నలకు తీపికబురు.. పంట రుణమాఫీ ప్రకటించిన సీఎం విజయ్
-
Life Insurance Mistakes: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేయకండి!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?