Banaganapalli YSR Politics : ఆ ఎమ్మెల్యే ఇంట్లోనే రాజకీయ లుకలుకలు మొదలయ్యాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banaganapalli YSR Politics : ఆ ఎమ్మెల్యే ఇంట్లోనే రాజకీయ లుకలుకలు మొదలయ్యాయా? రాజకీయంగా వేరు కుంపట్లు పెడుతున్నారా? అనుచరులు ఒక్కొక్కరుగా గుడ్బై చెప్పేస్తున్నారా? వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి?
కాటసాని రామిరెడ్డి. బనగానపల్లి ఎమ్మెల్యే. ఇక్కడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పీఆర్పీ నుంచి ఒకసారి.. 2019లో వైసీపీ నుంచి శాసనసభ్యుడయ్యారు రామిరెడ్డి. మరో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి తమ్ముడు. గతంలోనే ఇద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు వచ్చాయి. ఒకరు కాంగ్రెస్లో మరొకరు టీడీపీలో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ వైసీపీలోనే కొనసాగుతున్నా.. రామిరెడ్డి కుటుంబంలో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి.
Also Read
రామిరెడ్డి అన్న కుమారుడు కాటసాని రమాకాంత్ రెడ్డి అవుకు మండలం గుండ్ల సింగవరం సర్పంచ్ గా వున్నారు. ఈ మధ్య రమాకాంత్ రెడ్డి ఫేస్బుక్లో ఓ పోస్టింగ్ పెట్టారు. వైసీపీ కి గుడ్ బై…. సారి సీఎం జగన్ అంటూ ఆయన కామెంట్స్ చేశారు. త్వరలో మరో పార్టీలో చేరేందుకు నిర్ణయించారట. త్వరలోనే మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేస్తారట. గుర్తింపు ఉన్న మరో పార్టీలో చేరితే తన వాణి బాగా వినిపించవచ్చనే నిర్ణయానికి వచ్చారట రమాకాంతరెడ్డి. కాటసాని కుటుంబంలో గొర్లగుట్ట వద్ద ఏడుగురిని ఒకేసారి హత్య చేసిన తర్వాత.. రమాకాంత్ రెడ్డి తండ్రి కాటసాని శివరామిరెడ్డి బాధ్యతలు భుజాన వేసుకొని ఫ్యాక్షన్ గొడవలకు బలయ్యారు. ఇపుడు తనకు రాజకీయ ఎదుగుదల లేకుండా చేశారనే అసంతృప్తిలో రమాకాంత్ రెడ్డి ఉన్నారట. కాటసాని రామిరెడ్డి ప్రస్తుతం తన కుమారుడు ఓబులరెడ్డిని ప్రోజెక్ట్ చేస్తున్నారని, ఇలాగైతే తాము ఎప్పుడు ఎదుగుతామనే అభిప్రాయంతో ఉన్నారట.
కాటసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి కూడా వైసీపీ కి గుడ్బై చెప్పేసారు. గతంలో మల్లికార్జున రెడ్డి తండ్రి టీడీపీలో వున్నారు. కాటసాని రామిరెడ్డి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన తరువాత మల్లికార్జున రెడ్డి ఇటొచ్చారు. చాలా కాలంగా రామిరెడ్డితో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారట. సొంత కుటుంబ సభ్యులకు ప్రయారిటీ ఇస్తూ.. తనకంటే జూనియర్లకు పదవులు కట్టబెడుతున్నారని.. అలాంటప్పుడు వైసీపీలో ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తూ వెళ్లిపోయారట. కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి , నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
రమాకాంత్ రెడ్డి వైసీపీ నుంచి బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యుల ద్వారా ఎమ్మెల్యే రామిరెడ్డి మంతనాలు చేస్తున్నారట. కానీ రమాకాంత్రెడ్డి ఒప్పుకోవడం లేదట. మొత్తానికి వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు దూరం కావడం హాట్ టాపిక్ అయింది. మరి.. పార్టీ పెద్దలు సమస్య గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపడతారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!