Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Are Colors Changing In Pathapatnam Constituency Ycp

MLA Reddy Shanti : పాతపట్నం వైసీపీలో రంగులు మారుతున్నాయా?

Published Date :September 8, 2022 , 11:21 am
By Premchand Chowdary
MLA Reddy Shanti : పాతపట్నం వైసీపీలో రంగులు మారుతున్నాయా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కుటుంబ రాజకీయ చరిత్ర.. బలమైన కుల సమీకరణలు కలసిరావడంతో ఎమ్మెల్యే అక్కడ పాగా వేశారు. ప్రస్తుతం ఆ బలమే బలహీనంగా మారుతోందట. స్థానికతను సాకుగా చూపిస్తూ వ్యతిరేకత పెరుగుతోందట. నాడు పల్లకీ మోసిన వాళ్లే నేడు రాంరాం అంటున్నారా? ఎందుకలా? లెట్స్‌ వాచ్‌..!

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా హిర మండలంలో సమావేశం అయ్యారు. కొత్తూరు వైస్ ఎంపీపీ తులసి వరప్రసాద్ నేతృత్వంలో 5 మండలాల అసమ్మతి నేతలంతా ఆ సమావేశానికి వచ్చారట. నాన్ లోకల్ అయిన రెడ్డి శాంతికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేశారట అసమ్మతి నేతలు. మొదటి నుంచి వైసీపీ కోసం కష్టపడే నేతలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని.. అసహనం వ్యక్తం చేశారట. స్థానికులకు టికెట్‌ కేటాయించాలనే డిమాండ్‌ను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో తీర్మానించినట్టు తెలుస్తోంది.

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

పాతపట్నంలో స్థానికేతరులను ఎమ్మెల్యేలుగా చేయడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిర మండలంలో జరిగిన ఆ సమావేశం ప్రస్తుతం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. మొన్నటి వరకు ఎమ్మెల్యేపై విపక్ష పార్టీలు విరుచుకుపడితే.. ఇప్పుడు స్వపక్షంలోని వైరి వర్గమే ఆ పాత్ర పోషిస్తోంది. పైగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గ్రామ గ్రామానికీ తీసుకెళ్లే పనిలో పడ్డారట.

వంశధార జలాలను ఇతర ప్రాంతాలకు తరలించుకు పోతున్నారని.. నియోజకవర్గ ప్రజలకు నీళ్లు కరువయ్యాయని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పార్టీలో ఒంటెద్దు పోకడలు.. ఎమ్మెల్యే PAల అత్యుత్సాహం మొదటికే మోసం తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డి శాంతి కుమారుడు హిర మండలంలో జడ్పీటీసీగా ఓడిపోయారు. అయినప్పటికీ ఎమ్మెల్యే వైఖరిలో మార్పు లేదని మండిపడుతున్నారట.

మాజీ మంత్రి పాలవలస రాజశేఖరం కుమార్తె ఎమ్మెల్యే రెడ్డి శాంతి. పాతపట్నంతోపాటు మరో రెండు నియోజకవర్గాల్లో పాలవలస కుటుంబం పట్టు ఎక్కువ. ఇక్కడ పాలవలస కుటుంబం చెప్పిన వాళ్లకే టికెట్‌ ఇస్తుంటారు. ఆ కోటాలోనే రెడ్డి శాంతికి టికెట్‌ దక్కింది. జిల్లాల విభజన తర్వాత పరిస్థితి మారిపోయిందనే చర్చ నడుస్తోంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండబోవని.. సమయం వస్తే తిరుగుబావుటాలు తప్పదని కామెంట్స్ చేస్తున్నారట. ఈ లుకలుకల తీవ్రత పెరిగి.. పాతపట్నంలో పార్టీతోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాలు వెలవెలబోతున్నాయి. ఎమ్మెల్యే పాల్గొనే.. చేపట్టే ప్రోగ్రామ్స్‌కు ఆమంటే గిట్టని వాళ్లు రావడం లేదు. మరి.. సమస్యను సర్దుబాటు చేసేందుకు వైసీపీ పెద్దలు చొరవ తీసుకుంటారో.. లేక పాలవలస కుటుంబమే నష్ట నివారణ చర్యలు చేపడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • MLA Reddy Shanti
  • Palavalasa Rajashekaram
  • Ram Mohan Naidu Kinjarapu
  • srikakulam district
  • YSR Congress Party

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions