Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Another Twist On The Sand Attack Controversy

ఏపీ దేవాదాయశాఖలో మలుపు తిరిగిన ఇసుక దాడి !

Published Date :September 17, 2021 , 8:16 pm
By Lakshmi Narayana
ఏపీ దేవాదాయశాఖలో మలుపు తిరిగిన ఇసుక దాడి !
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేవాదాయశాఖలో ఆయనో సీనియర్‍ ఆఫీసర్‌. పదేళ్లకుపైగా సర్వీస్‌. రేపో మాపో పదోన్నతి దక్కుతుందన్న తరుణంలో.. చేస్తున్న కొలువుకు ఆయన ఓ దణ్ణం పెట్టేశారు. అదీ అవమాన భారం భరించలేక. ఇంతకీ ఎవరా అధికారి…!!?. ఆయన కలతకు కారణం ఏంటి…!?.

ఇసుక దాడి వివాదంలో మరో ట్విస్ట్‌!

గుర్తుందా విశాఖ దేవాదాయశాఖ కార్యాలయంలో కూర్చున్న ఓ అధికారిపై ఓ మహిళా ఉద్యోగి ఇసుక వేయడం. అదీ సీసీ కెమెరాలో రికార్డ్‌ కావడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడం.. ఆ వ్యవహారం ఎంత రచ్చ.. చర్చ అయ్యిందో.. ఇప్పుడు అదే అంశంలో మరో విషయం చర్చగా మారింది. ఈ ఏడాది ఆగస్ట్ 5న విశాఖజిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఇంఛార్జ్‌ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుకతో దాడి చేశారు. ఆపై శాపనార్ధాలు పెట్టారు.

ఇంఛార్జ్‌ డీసీగా పుష్పవర్దన్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు!

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన దేవాదాయశాఖ.. ఆర్జేసీ సురేష్‌బాబుతో విచారణ చేయించింది. తగువుపడ్డ ఇద్దరు అధికారులను విచారించి ఎండోమెంట్ కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. నివేదిక వివరాలు మాత్రం గోప్యంగానే ఉండిపోయాయి. ఆపై ఇరువురు అధికారుల పంచాయితీ అమరావతికి చేరింది. కమిషనర్ ఇద్దరి వాదనలు విన్నారు. కిందిస్ధాయి ఉద్యోగి బదిలీని తీవ్రంగా పరిగణించి ఏసీ శాంతి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు డీసీ పుష్పవర్ధన్. చివరకు ఇద్దరినీ మందలించి పంపించేశారు. ఈ వివాదం టీకప్పులో తుఫాన్‌గా మిగిలిపోతుందని దేవాదాయశాఖ వర్గాలు భావించాయి. ఇంతలో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. వైజాగ్ ఇంఛార్జ్‌ డీసీ పదవి నుంచి పుష్పవర్ధన్‌ను తొలగించి హెడ్‌ఆఫీస్‌కు బదిలీ చేశారు. అసిస్టెంట్ కమిషనర్‌గానే కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది దేవాదాయశాఖ.

ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేసిన పుష్పవర్దన్‌

ఈ నిర్ణయం పుష్పవర్ధన్‌కే కాదు.. ఆ శాఖ ఉద్యోగులకు షాకింగ్ పరిణామం. పైగా ఏసీ శాంతిని అదేస్ధానంలో కొనసాగించడం పుష్పవర్ధన్ అవమానంగా భావించారు. తన తప్పు లేకపోయినా బదిలీ చేశారని కలత చెందిన ఆయన.. ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేశారు. దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ వాణీమోహన్‌కు రిజైన్‌ లెటర్‌ ఇచ్చి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. పుష్పవర్ధన్ నిర్ణయం ఇప్పుడు చర్చగా మారింది. ప్రొబేషనరీ కాలం కూడా పూర్తికాని ఒక జూనియర్‌ అధికారి తనపై ఇసుకతో దాడిచేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా తనను బాధ్యతల నుంచి తప్పించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన ప్రశ్న.

ఆలయాలపై వేసిన త్రిసభ్య కమిటీలో పుష్పవర్దన్‌ సభ్యుడు

సింహాచలం ఆలయ భూముల గోల్‌మాల్‌ విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో పుష్పవర్దన్‌ సభ్యుడు. మాన్సాస్, బొబ్బిలి వేణుగోపాలస్వామి గుడి ఆస్తులపైనా ఆయన పనిచేస్తున్నారు. ఇలా కీలక స్థానంలో ఉన్న సీనియర్ అధికారిని అనూహ్యంగా బదిలీ చేయడం ఉద్యోగుల్లో చర్చ జరుగుతోందట. అంతా రాజకీయ ప్రమేయంతోనే జరిగిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పుష్పవర్ధన్ సైతం తాజా పరిణామాలపై సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయం వెనక బలమైన కారణంతోపాటు భయం ఉందని టాక్‌.

ఇప్పటికే ఇద్దరు అధికారులపై చర్యలు!

ప్రస్తుతం ఆలయ భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ సమయంలో నిబంధనల మేరకు ఉద్యోగం కత్తిమీద సామే. అదే అభిప్రాయంలో పుష్పవర్దన్‌ ఉన్నారట. ఇతర ప్రభుత్వ శాఖలు వేటిల్లోనూ లేనివిధంగా ఇటీవల దేవాదాయశాఖలో అధికారులపై చర్యలు ఉన్నాయి. సింహాచలం భూముల వివాదంలో అప్పటి ఈవో రామచంద్రమోహన్, అసిస్టెంట్ కమిషనర్ సుజాతలపై వేటు వేసింది ప్రభుత్వం. విజిలెన్స్ విచారణ పూర్తయితే ఇంకా చాలామందిపై చర్యలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే కీలక బాధ్యతల్లో ఉంటూ అపవాదులు మూటగట్టుకోవడం అనవసరమనే అభిప్రాయంలో పుష్పవర్ధన్ ఉన్నట్టు వినికిడి. శాఖాపరమైన అంశాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతే.. ఇక ఎవరికోసం పనిచేయాలని ఆయన ఆవేదన చెందుతున్నారట. మరి.. ఈ ఇసుక దుమారం ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • off the record

తాజావార్తలు

  • Fuel Gases: LPG, CNG, PNG మధ్య తేడాలు ఏంటి.. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు..?

  • Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది..? నిపుణులు ఏమంటున్నారంటే..

  • Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

  • Michael Vaughan: టీ20 ప్రపంచకప్‌లో అత్యంత ‘తెలివితక్కువ జట్టు’ అదే.. టీమిండియాపై మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Anasuya: వ్యూస్ కోసం అనసూయపై వికృత చేష్టలు.. వ్యక్తి అరెస్ట్

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions