Amith Shah Munugode Meeting :మునుగోడు కోసం బీజేపీ వ్యూహం మార్చిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amith Shah Munugode Meeting :అమిత్ షా సభలో చాలామంది బీజేపీలో చేరతారని ఊదరగొట్టారు కమలనాథులు. కానీ.. సభలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాత్రమే కాషాయ కండువా కప్పుకొన్నారు. మరి.. షా సమక్షంలో బీజేపీలో చేరాలని ఆశించిన వారికి ఎవరు బ్రేక్ వేశారు? వారు ఎందుకు చేరలేదు? బీజేపీ ఏం చెబుతోంది?
బీజేపీలో చేరికలకు టైమ్ దగ్గర పడిందని.. వివిధ పార్టీల నుంచి వెల్లువలా వస్తారని కొంతకాలంగా కమలనాథులు ఊదరగొడుతున్నారు. రకరకాల పేర్లూ చర్చల్లోకి వస్తున్నాయి. అమిత్ షా సమక్షంలో చాలా మంది బీజేపీలో జాయిన్ అవుతారని భావించారు కూడా. సహజంగా బీజేపీలో చేరాలని అనుకున్నవాళ్లు అమిత్ షా చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకోవాలని ఆశిస్తారు. దానికి తగ్గట్టుగానే మునుగోడు సభకు షా రావడంతో బీజేపీలో చేరిపోదామని అనుకున్నారట. కానీ.. మునుగోడు సభలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాత్రమే బీజేపీలో చేరారు. దీంతో ఏం జరిగింది? చేరికలకు ఎక్కడ బ్రేక్ పడింది? ఎవరైనా అడ్డుకున్నారా? పార్టీ మారతారని ప్రచారంలో ఉన్నవాళ్లు ఎందుకు చేరలేదు అని ప్రశ్నలు సంధిస్తున్నారు కొందరు.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
మునుగోడు సమరభేరి సభ ఉద్దేశం వేరని.. అక్కడ ఉపఎన్నిక ఉండటంతో ఇతర నేతలను చేర్చుకునే ప్రక్రియను ఆపారని పార్టీ వర్గాల వాదన. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేవలం రాజగోపాల్రెడ్డి మాత్రమే బీజేపీలో చేరాలా ప్లాన్ మార్చారట. అప్పుడే అమిత్ షా టూర్ మునుగోడులో హైలైట్ అవుతుందని.. దానిపైనే చర్చ జరగుతుందని అభిప్రాయపడ్డారట. ఇతర ప్రాంతాల నేతలు మునుగోడు సభలో బీజేపీలో చేరితే చర్చ పక్కకెళ్లే ప్రమాదం ఉందని భావించారట.
వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి ప్రదీప్రావు.. హుస్నాబాద్కు చెందిన బొమ్మ శ్రీరామ్ తదితరుల అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారని ప్రచారం చేశారు. అది జరగకపోవడంతో.. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారని.. ఆసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని.. అప్పుడు చేరికలు ఉంటాయని చెబుతున్నారు. కీలక నాయకులను పక్కన పెడితే.. కనీసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు.. ఆయన అనచరులు.. మునుగోడుకు చెందిన ఇతర పార్టీ నేతలు వేదికపై బీజేపీ కండువా కప్పుకొని ఉంటే మరోలా ఉండేదని లెక్కలేస్తున్నారట.
మునుగోడుకు చెందిన కొందరు స్థానిక సంస్థల ప్రతినిధులను బీజేపీ చేర్చుకుంది. అయితే వారిపై పాత కేసులు తిరగదోడటంతో.. బీజేపీ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. వారిని ఇప్పుడే తెరపైకి తీసుకొస్తే ఇబ్బందులు వస్తాయని.. ప్రస్తుతం ఎక్కడి వారిని అక్కడే ఉంచి రాజకీయం చేయాలని.. వారితోనే తదుపరి కార్యాచరణ నడిపించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ వ్యూహం బీజేపీకి కలిసి వస్తుందా? అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాలని ఆశించి.. భంగపడినవారిని బుజ్జగించారా? మునుగోడు వ్యూహం వర్కవుట్ అవుతుందో లేదో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!