Diabetes Test : షుగర్ టెస్ట్ మోసమా? లాన్సెట్ అధ్యయనంలో నమ్మలేని నిజాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశాన్ని పట్టిపీడిస్తోన్న సమస్యల్లో డయాబెటిస్ వ్యాది ఒకటి. దాదాపు 9 కోట్ల మంది డయాబెటిస్తో జీవిస్తున్న దేశం ఇది. ప్రతి పరీక్షలో, ప్రతి హెల్త్ క్యాంప్లో, ప్రతి రిపోర్ట్లో ఒకే టెస్ట్ పేరు కనిపిస్తుంది. అదే HbA1c. అయితే లాన్సెట్ రీజినల్ హెల్త్లో ఫిబ్రవరి 9న ప్రచురితమైన అధ్యయనం ఒక హెచ్చరిక జారీ చేసింది. భారత్ లాంటి దేశాల్లో రక్తహీనత, జన్యుపరమైన రక్తవ్యాధులు ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం HbA1c టెస్ట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమట. ఇంతకీ HbA1c టెస్ట్లో సమస్య ఎక్కడుంది? భారతీయుల విషయంలో ఈ టెస్ట్ ఎందుకు ప్రశ్నార్థకంగా మారింది?
రెండు నుంచి మూడు నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయిని కొలిచే పరీక్షను HbA1c అంటారు. రక్తంలోని హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్పై గ్లూకోజ్ ఎంత శాతం అంటుకుందో సే పరీక్ష ఇది.
సాధారణంగా 5.7శాతం కంటే తక్కువ ఉంటే నార్మల్గా భావిస్తారు. 5.7 నుంచి 6.4 శాతం మధ్య ఉంటే ప్రీడయాబెటిస్గా, 6.5 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్గా నిర్ధారిస్తారు. సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఈ పరీక్ష పూర్తిగా హీమోగ్లోబిన్పై ఆధారపడి ఉంటుంది. అయితే రక్తహీనత బాధితులు ఎక్కువగా ఉన్న దేశం ఇండియా. కొన్ని ప్రాంతాల జనాభాలో సగానికి పైగా మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హీమోగ్లోబిన్ పరిమాణం లేదా దాని జీవితకాలం మారిపోతే HbA1c రీడింగ్ తప్పుగా రికార్డయ్యే అవకాశం ఉంటుంది.
Also Read
- Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
- NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
- Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
- Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్న్యూస్..ఇండియాలో వర్షాలు..!
లాన్సెట్ రీజినల్ హెల్త్లో ప్రచురితమైన ఈ రివ్యూకు ప్రొఫెసర్ అనూప్ మిశ్రా నేతృత్వం వహించారు. ఆయన ప్రకారం కేవలం HbA1c ఆధారంగా డయాబెటిస్ నిర్ధారణ చేస్తే కొంతమంది రీడింగ్ తప్పుగా రావొచ్చు. మరికొందరికి అసలు షూగర్ లేకపోయినా డయాబెటిస్గా ట్యాగ్ పడే ప్రమాదం ఉంది. ఇది చికిత్స ప్రారంభంలోనే గందరగోళం సృష్టిస్తుంది.
ఇక హీమోగ్లోబిన్ నిర్మాణాన్ని ప్రభావితం చేసే జన్యుపరమైన వ్యాధులు కూడా భారత్లో కనిపిస్తాయి. థలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, జీ6పిడీ లోపం లాంటి పరిస్థితుల్లో ఎర్ర రక్త కణాల జీవితం తక్కువగా ఉండొచ్చు లేదా వాటి నిర్మాణం మారిపోవచ్చు. అప్పుడు HbA1c విలువలు నిజమైన చక్కెర స్థాయిని కొలవకపోవచ్చు. లెక్కల ప్రకారం భారత్లో సుమారు 9 కోట్ల మంది డయాబెటిస్తో జీవిస్తున్నారు. అదే సమయంలో కోట్లాది మంది రక్తహీనతతో కూడా బాధపడుతున్నారు. ఈ రెండు పరిస్థితులు కలిసినప్పుడు HbA1c మీద మాత్రమే ఆధారపడటం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరొక అంశం ల్యాబ్ నాణ్యత. దేశవ్యాప్తంగా అన్ని ప్రయోగశాలల్లో ఒకే స్థాయి ప్రమాణాలు ఉండవు. క్వాలిటీ కంట్రోల్ లోపిస్తే HbA1c విలువల్లో తేడాలు రావచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఓవరాల్గా చూస్తే HbA1cతో పాటు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ లాంటివి చేయడం తప్పనిసరి అని ఈ అధ్యయనం చెబుతోంది.
ALSO READ: మంచు కొండల నుంచి కారుతున్న రక్తం.. ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రకృతి రహస్యం!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!