Iran Religious Dictatorship: మానవత్వం ఎక్కడో చచ్చిపోయింది.. మేధావులకు రాజకీయాలే ఎక్కువయ్యాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడ పుడితేనేం మనిషి తీసుకునే శ్వాస ఒకటే కదా.. ఒకరి గుండె పగిలితే ఆ చీలిక మనలోనూ వినిపించాలి కదా! ఎన్నో శతాబ్దాల క్రితం పెర్షియన్ కవి సాది షిరాజీ చెప్పినట్టు మనుషులంతా ఒకే శరీరానికి భాగాలు.. ఒకరి నొప్పి ఇంకొకరిని తాకాలి.! మరి ఈరోజు అలాంటి భావన ప్రజల్లో కనిపిస్తుందా? ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రపంచమంతా మానవత్వం గురించి కాకుండా రాజకీయాలే గురించే ఎక్కువగా ఎందుకు మాట్లాడుతోంది?
ఇరాన్లో ఓ చిన్నారి నవ్వు మధ్యలోనే ఆగిపోతుంటే మనుషులకు రాజకీయాలే ఎక్కువయ్యాయా? అసలు ఇరాన్ ప్రజలు బయటవారితోనే కాదు.. సొంత దేశంలోనే పరాయి వారిగా బతుకుతున్న విషాదం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇలా ఇంటా..బయటా రెండింటి మధ్య చిక్కుకుని ప్రతి రోజు గడిపే ఇరాన్ ప్రజల జీవితాలు ఎప్పటికి మారుతాయి?
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా మాత్రమే కనిపించొచ్చు
కానీ వాస్తవం మాత్రం వేరు. ఓవైపు బాంబులు పడుతుంటే.. మరోవైపు ఇళ్లు కూలిపోతుంటే సామాన్యులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి.
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్న కొద్దీ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దాదాపు 2వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంచనా. కానీ ఆ సంఖ్యల్లో కనిపించని ఎన్నో కథలు ఉన్నాయి. ఎప్పుడైనా చివరి రోజు కావచ్చనే ఆలోచనతో గడిచే క్షణాలున్నాయి. ఇక్కడ ఒక కీలక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచం ఈ పరిస్థితిని ఎక్కువగా జియోపాలిటిక్స్గా చూస్తోంది. అంటే అమెరికా వర్సెస్ ఇరాన్ శక్తుల పోరుగా లెక్కకడుతోంది. అందుకే ఈ సీన్లో ఇరాన్ ప్రజల బాధ కనిపించకుండా పోతోంది. ఈ పరిస్థితి ఒక్కరోజులో రాలేదు. దీని వెనుక ఒక లోతైన చరిత్ర ఉంది. 1953లో ఇరాన్లో ప్రజాస్వామ్యానికి మొదటి అడుగులు పడుతున్న సమయంలో ప్రధాని మొహమ్మద్ మోసాదెఘ్ ఆ దేశపు ఆయిల్ను స్వాధీనం చేసుకున్నాడు. అది ప్రపంచ శక్తులకు నచ్చలేదు. దీంతో ఒక కూప్ జరిగింది.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఆ తర్వాత వచ్చిన పాలనలో అసంతృప్తి పెరిగింది. దానికి ముగింపుగా 1979లో జరిగిన ఇరానియన్ రివల్యూషన్ దేశాన్ని పూర్తిగా మార్చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది. అక్కడి నుంచి ప్రజల జీవితం మరో దిశలోకి వెళ్లింది. జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం నియంత్రించడం ప్రారంభించంది.
మహిళల జీవితాలు స్వేచ్ఛ లేకుండా పోయాయి. మహిళలు ఏం ధరించాలి? ఎవరితో మాట్లాడాలనే నియమాలు పెరిగాయి. ఇక్కడ ఒక విరుద్ధమైన వాస్తవం కూడా కనిపిస్తుంది. ఇరాన్లో మహిళల లిటరసీ రేటు 85 శాతం దాటింది. యూనివర్సిటీల్లో మహిళల చేరిక 50 నుంచి 60 శాతం వరకు ఉంది. అంటే చదువులో వారు ముందున్నారు కానీ నిజమైన విద్య అంటే కేవలం పుస్తకాలు కాదు కదా..! స్వేచ్ఛ కూడా అవసరం.. రెక్కలు కట్టేసి ఎగరమంటే అది విద్య కాదు. అదే అక్కడి మహిళల పరిస్థితి..! చదువులో ముందున్నా స్వేచ్ఛలో వెనుకబడిన దుస్థితి వారిది. అదే కారణంగా ఎన్నో సార్లు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. మహిళలు తమ హక్కుల కోసం గళం ఎత్తారు. కానీ ప్రతిసారి ఆ గళాన్ని అణచివేశారు. 2022లో మహ్సా అమిని ఘటన తర్వాత వచ్చిన ఉద్యమం దేశం మొత్తం కదిలించింది.
విమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే నినాదం దాదాపు 160 నగరాలకు వ్యాపించింది కానీ ఆ ఆశలు కూడా హింసతోనే అణచబడ్డాయి. ఇక్కడితో ఇది ఆగలేదు.. పేదలు, వర్కింగ్ క్లాస్, మైనారిటీలు.. ఇలా ప్రతి వర్గం తమదైన సమస్యలతో పోరాడుతోంది.
కుర్ద్స్, సున్నీలు, బలూచ్ ప్రజలు సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వివక్షను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో ఇరాన్ ప్రజల మనసులో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఇప్పటికీ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. కొంతమంది మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొందరు బయట నుంచి సహాయం వస్తుందేమో అని ఆశిస్తున్నారు. కానీ యుద్ధం మొదలైన తర్వాత ఈ ఆశలు కూడా మారుతున్నాయి. ముందు మార్పు కోసం ఎదురుచూసిన వాళ్లు కూడా ఇప్పుడు బాంబుల భయంతో జీవిస్తున్నారు. స్వేచ్ఛ కంటే ముందుగా ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం అయింది. ఇదే అసలు విషాదం. బయట నుంచి వచ్చే దాడులు..లోపల ఉన్న నియంత్రణ..ఇలా ఈ రెండింటి మధ్య ప్రజలు చిక్కుకుపోయారు. అయితే ప్రపంచం ఒక వైపు మాత్రమే చూస్తోంది. కానీ నిజం రెండు వైపులా ఉంది. ఒకటి ఇంపీరియలిజం. మరొకటి రిలీజియస్ కంట్రోల్.
ఇరాన్ ప్రజలు ఈ రెండింటినీ ఎదుర్కొంటూ ప్రతి రోజు గడుపుతున్నారు చివరికి ఒక సాధారణ ఇరానియన్ మహిళ మనసులో ఉన్న భావన ఇదే. బాంబులు ఆగిపోయిన తర్వాత కూడా మార్పు రాకపోతే మిగిలేది కూలిపోయిన ఇళ్లే. అందుకే ఇలాంటి వ్యవస్థ మారకపోతే ఎప్పటికైనా ఇరాన్ పాలన కూలక తప్పదు. అది బయట నుంచా..లోపలా నుంచా అన్నది మాత్రం ఇప్పటికైతే చెప్పలేం.
తాజావార్తలు
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!