NTV Telugu Site icon

Nandigam Suresh: మందు తాగినవాళ్లు మాత్రమే ఊగాలి, వాగాలి.. పవన్‌ ఎందుకు అలా ఊగుతున్నారు..?

Nandigam Suresh

Nandigam Suresh

Nandigam Suresh: పవన్‌ కల్యాణ్‌ ఊగుతూ.. వాగుతుంటారు.. సాధారణంగా మందు తాగినవాళ్లు మాత్రమే ఊగాలి, వాగాలి.. కానీ, పవన్‌ కల్యాణ్‌ ఎందుకు అలా ఊగుతున్నారు..? అంటూ ప్రశ్నించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగామ సురేష్.. పవన్ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారు.. పవన్ ప్యాకేజ్ ఏ క్లాస్ నుంచి అందుకున్నారు..? అని నిలదీశారు. పవన్ పోటీ చేసిన స్థానాల్లో ఖర్చు పెట్టిన డబ్బు ఏ క్లాస్ నుంచి వచ్చింది, ఎవరు ఖర్చు పెట్టారు ప్రజలకు తెలుసు అంటూ విమర్శలు గుప్పించిన ఆయన.. పవన్ టీ తాగిన గ్లాస్ పవన్ తెచ్చుకుంటే.. టీ చంద్ర బాబు పోశాడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి బానిసత్వం చేయటంలో పవన్ కి అలసట రావటం లేదు.. సీఎం జగన్ సంక్షేమం చేస్తుంటే రాష్ట్ర శ్రీలంక అవుతుందని పవన్ అంటున్నాడు.. మరి అదే పవన్ అధికారంలో వస్తే జగన్ కంటే ఎక్కువ చేస్తామనటానికి సిగ్గు ఉండాలి అని మండిపడ్డారు.

Read Also:Kidnap: ఫైనాన్స్ కంపెనీ అరాచకం.. ఈఎంఐ కట్టలేదని కస్టమర్‌ కూతురి కిడ్నాప్..

పవన్ తాను మాత్రమే సత్య హరిచంద్రుడు అని అనుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ నందిగామ సురేష్‌.. పవన్ మాత్రం అందరినీ విమర్శిస్తాడట.. ఆయన మాత్రం అందరిపై విమర్శలు చేస్తాడు.. కానీ, విమర్శలు చేస్తే సమాధానం చెప్పాలి తప్ప పవన్ కల్యాణ్‌కు ఆవేశం ఎందుకు? అని ప్రశ్నించారు. 2014లో కలిసి ఉన్న మీరు (జనసేన, టీడీపీ) 2019లో ఎందుకు మీ మధ్య చెడింది? అని ప్రశ్నించారు. జగన్ ను ఎదుర్కోవటం కోసం వేర్వేరు తలలు పెట్టుకుని అప్పట్లో పోటీ చేసేవారు.. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినివ్వం అంటూ మళ్లీ ఏకం అవుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఎవ్వురు ఏకమైనా.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే.. మరోసారి వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఎంపీ నందిగామ సురేష్‌.