MP Gurumurthy: పుష్ప-2 గెటప్లో వైసీపీ ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Gurumurthy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది.. బన్నీ చీరకట్టి, కాళికా మాత రూపంలో దర్శనమిచ్చాడు.. మాతంగి గెటప్లో ఉన్న అల్లు అర్జున్ను చూసి ఫ్యాన్స్ రకరకాల కథలు అల్లేశారు.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గురుమూర్తి మాతంగి వేధారణలో కనిపించారు.. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా జరుగుతుండగా.. వివిధ వేషాల్లో పొంగళ్ళు సమర్పించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.. ఇక, తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా పుష్ప-2 వేషధారణలో గంగమ్మ భక్తి చైతన్య యాత్రలో పాల్గొన్నారు.
Read Also: CBI Director: సీబీఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్.. కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు
Also Read
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ మాతంగి వేషంలో ఇమిడిపోతే.. ఎంపీ గురుమూర్తి కూడా మాతంగి వేషధారణలో ఒదిగిపోయారు.. ఇక, ఎంపీతో ఫొటోలు దిగడానికి సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు భక్తులు.. కాగా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంతవీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, సారెతో భక్తి చైతన్య యాత్ర ప్రారంభమైంది. వందలాది మంది భక్తులు విచిత్ర వేషధారణలలో గంగమ్మ శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొన్నారు. తిరుపతి గంగమ్మ జాతర కన్నుల పండవుగా కొనసాగుతోంది. మొత్తం 8 రోజుల పాటు నిర్వహించే జాతరలో ఐదో రోజు మాతంగి రూపంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
అయితే, తెలంగాణలో బతుకమ్మ పండుగలు, సమ్మక్కసారక్క జాతర, బోనాల పండగలాగే తిరుపతిలో గంగమ్మ జాతర (తాతగట్టు గంగమ్మ జాతర) ఎంతో సుప్రసిద్ధమైంది. ఈ జాతరకు తిరుపతి నుంచే కాకుండా రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏడాది మే నెలలో గంగమ్మ తల్లి జాతర నిర్వహిస్తారు.. ఇక, గంగమ్మ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?