YSR Death Anniversary: వైఎస్ఆర్ సజీవంగా ఉన్నట్లే.. ఒక్కసారి కాలం వెనక్కి వెళ్తే బాగుండు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Death Anniversary: ఇప్పటికీ ఆ దివంగత నేత వైఎస్ఆర్ మనకు సజీవంగా ఉన్నట్లే.. ఒక్కసారి కాలం వెనక్కి వెళ్తే బాగుండు అన్నారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.. రాజశేఖర రెడ్డికి విగ్రహానికి నివాళులు అర్పించారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఇతర నేతలు.. ఇక, సజ్జల జ్యోతి ప్రజ్వలన చేయగా.. పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు పార్టీ శ్రేణులు..
ఇక, ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సరిగ్గా ఇదే రోజు వైఎస్ఆర్ ప్రయాణించిన విమానం కనిపించలేదు.. అయినా ఒక ధీమా ఉండేది.. ఆయన ఎక్కడికి వెళతారు.. కచ్చితంగా వస్తారు అనుకున్నాం.. కానీ దురదృష్టం వెంటాడింది.. అయితే, ఒక వ్యక్తి పాలన పై, ప్రజల జీవితాల పై ఎంత ప్రభావం వేయగలరు అనటానికి వైఎస్సార్ ఒక ఉదాహరణ అన్నారు. కోట్లాది ప్రజల. గుండెల్లో రాజశేఖరరెడ్డి చిరస్థానం సంపాదించారు. సిద్ధాంతాలు పెట్టుకుని పాలించలేదు.. అందరూ తన కుటుంబ సభ్యులే అనుకున్నారు. రాష్ట్రాన్ని దేశంలో తలమానికంగా నిలబెట్టారు.. ప్రజల జీవితాల్లో ఒక వెలుగు తెచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్ తర్వాత అలుముకున్న చీకటిలో వెలుగు రేఖ తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు సజ్జల.. మాట మీద నిలబడే తత్వమే ప్రజల్లో ఆయన అంటే ఒక నమ్మకాన్ని సృష్టించిందన్న ఆయన.. ఆయనకు నిజమైన రాజకీయ వారసుడిగా జగన్ గత నాలుగేళ్లుగా పాలన చేస్తున్నారని కొనియాడారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఒక్కసారి కాలం వెనక్కి వెళితే బాగుండు అన్నారు. ఇప్పటికీ వైఎస్ఆర్ మనకు సజీవంగా ఉన్నట్లే.. వైఎస్సార్ నడకలో ఒక ఠీవి ఉండేది.. ఆయన దూరం అయి పద్నాలుగు సంవత్సరాలు అయ్యింది.. అయినా, పేదవాడి గుండె తాకితే వైఎస్సార్ అన్నారు. రాజశేఖరరెడ్డి మానవతా వాది.. రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే ఆయన బాటలో జగన్ నాలుగు అడుగులు వేస్తున్నారని తెలిపారు. మరోవైపు.. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. కుల, మత, ప్రాంత విభేదం లేకుండా సంక్షేమ పథకాలు అందించారు.. వైఎస్సార్ గొప్ప పాలనాదక్షుడు.. వైఎస్సార్ ఆలోచనలను జగన్ ముందుకు తీసుకుని వెళుతున్నారని తెలిపారు మంత్రి మేరుగ నాగార్జున.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!