Janasena: పవన్‌ సమక్షంలో జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి రోశయ్య

  • జనసేనలో చేరిన ముగ్గురు వైసీపీ కీలక నేతలు
  • పవన్‌ సమక్షంలో జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి..సామినేని ఉదయభాను..కిలారి రోశయ్య
Janasena

Janasena

Janasena: వైసీపీకి మరో బిగ్ షాక్‌ తగిలింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌ వారికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. వారితో పాటు పారిశ్రామికవేత్త కంది రవిశంకర్‌ కూడా జనసేనలో చేరారు. అంతకు ముందు బాలినేని శ్రీనివాస్ రెడ్డి భారీ ర్యాలీగా బయలుదేరి మంగళగిరి చేరుకున్నారు.

Read Also: Minister Payyavula: ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పనితీరుపై మంత్రి పయ్యావుల సమీక్ష