YSRCP Candidates List: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Candidates List: లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు జగన్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. సామాజిక వర్గాల వారీగా 2019తో పోలిస్తే ఈసారి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఎక్కువ సీట్లను సీఎం జగన్ కేటాయించారు.
Read Also: Payal Rajput: బాత్ టబ్ లో మందు గ్లాసుతో రచ్చ చేసిన పాయల్.. వీడియో వైరల్..
Also Read
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
ఇక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ దాదాపు 50 శాతం మేర సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైసీపీ కేటాయించింది. 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించారు. ఇక, వంద సీట్లగానూ 84 ఎమ్మెల్యే, 16 ఎంపీ సీట్లలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ నేతలకు జగన్ ఛాన్స్ ఇచ్చారు. ఎంపీ సీట్లలో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించగా.. మహిళలకు ఐదు ఎంపీ సీట్లు కేటాయించారు. ఇక, ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే 175 సీట్లలో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 48, ఓసీలకు 91 స్థానాలను కేటాయించారు. మైనారిటీలకు 7, మహిళకు 19 ఎమ్మెల్యే సీట్లను సీఎం జగన్ ఇచ్చారు.
Read Also: Ajay Pratap Singh: బీజేపీకి షాక్.. రాజ్యసభ ఎంపీ అజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామా
అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే 7 ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా ఇచ్చారు. ఇక, మహిళలకు 4 ఎమ్మెల్యే స్థానాలను ఎక్కువగా ఇవ్వగా.. 2019 ఎన్నికల సమయంలో బీసీలకు 41 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. ఇప్పుడూ 48 సీట్లు ఇవ్వగా.. మహిళలకు 2019లో 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. ఈసారి (2024)19 స్థానాలు అదనంగా ఇచ్చారు. ఇక, 2019లో మైనార్టీ వర్గాలకు 5 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వగా.. 2024లో ఏడు స్థానాలను కేటాయించారు. అలాగే, 2019తో పోలిస్తే మహిళలకు ఈసారి రెండు ఎంపీ సీట్లు ఎక్కువగా ఇచ్చారు. 2019తో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 4 ఎంపీ సీట్లను వైసీపీ అదనంగా కేటాయించింది.
తాజావార్తలు
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
-
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?