AP Elections 2024: ఆయనదే గెలుపు రూ.20 లక్షలు పందెం.. లేదు మా నాయకుడే.. రూ.50 లక్షలు పందెం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: పోలింగ్ ముగిసింది.. మరో మూడు రోజులు ఆగితే.. నాలుగో రోజు ఫలితాలు రాబోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారు? అనేదానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి.. ఇదే సమయంలో.. బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? అని మొదలుకొని.. కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో గెలుపు ఓటములతో పాటు.. మెజార్టీలపై బెట్టింగ్ కాస్తున్నారు.. అయితే, ఇప్పుడు ఈ జాబితాలోకి నేతలు సైతం చేరుతున్నారు.. కర్నూలు జిల్లా కోసిగి జడ్పీటీసీ మంగమ్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.. మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నాలుగోసారి గెలిచి మంత్రి పదవి చేపడుతాడని.. వైఎస్ జగన్ రెండోసారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తాడని నేను రూ.20 లక్షలు పందెం కాస్తాను.. ఎవరికైన ధైర్యం ఉంటే పందెంకు రావాలని.. రేపు ఒకటో తారీఖున కోసిగి ఎల్లమ్మ గుడి దగ్గర ఉంటానని అక్కడకు రావాలని బహిరంగంగా సవాల్ విసిరారు మంగమ్మ..
Read Also: Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.. (వీడియో)
Also Read
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
అయితే, కోసిగి జడ్పీటీసీ మంగమ్మకు ధీటుగా మంత్రాలయం మండలం వగరూరుకు చెందిన టీడీపీ నాయకుడు మడ్రి చిన్నన్న.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ప్రతిసవాల్ చేశారు.. రూ. 50 లక్షలు విలువ చేసే రెండు ఎకరాల పొలం పందెం కాస్తానని ప్రతి సవాల్ వదిలారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నిబంధనల విరుద్ధంగా పందెం కాయడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఇరు పార్టీల బహిరంగంగా నాయకులు సోషల్ మీడియా ద్వారా పందెం కాయడం ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఇరువర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని సిటిజన్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!