YS Sharmila : మళ్లీ పప్పులో కాలేసిన షర్మిలక్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయం అంటే ఆషామాషీ కదు.. అవగాహన లేకుండా రాజకీయాలు చేస్తామంటే దొరికిపోతారు. అపరిపక్వత లేని రాజకీయ నాయకులు ఉంటే ప్రజల ముందు పరువు పోగొట్టుకోవాల్సిందే. అలాంటి కోవలోకే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరై అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన ఆదివాసీ వీరులకు సలామ్.. ఇంద్రవెల్లి పోరుగడ్డకు సలామ్ అంటూ వ్యాఖ్యనించింది. సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని ఆమె అన్నారు.
Also Read : Aishwarya Rai Daughter : హైకోర్టులో గెలిచిన ఐశ్వర్యరాయ్ కూతురు
Also Read
- Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
అనంతరం వైఎస్ షర్మిల ఎంపీ సోయం బాపురావుతో మాట్లాడారు. ఇక్కడే ఆమె పొరపాటుపడింది. ఆదివాసీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ ఎంపీగా మీరు సీఎం కేసీఆర్ తో మాట్లాడి పోడు భూములకు పట్టాలు ఇప్పించండి అని షర్మిల సోయం బాపురావును కోరింది. ఆమె మాటలు విన్న ఎంపీ షాక్ అయ్యాడు. తాను గెలిచింది బీజేపీ నుంచి అయితే ఈమె ఏందీ బీఆర్ఎస్ ఎంపీని అంటోంది అని ఆలోచించి వెంటనే సోయం బాపురావు రియాక్ట్ అయ్యారు. అమ్మ నేను గెలిచింది.. బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో తప్పును గ్రహించిన షర్మిల ఎంపీ సోయం బాపురావును క్షమాపణలు కోరింది. మీరు బీఆర్ఎస్ ఎంపీగా భావించా అని పొరపాటు దిద్దుకుంది. ఈ పరిణామంతో అక్కడ ఉన్నవారందూ షర్మిల వ్యాఖ్యలకు నవ్వుకున్నారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Ponniyin Selvan 2: చోళులు వచ్చేసారు… ఈసారైనా నిలబడతారా?
ఎవరు ఏమిటో తెలుసుకో షర్మిల అని నెటిజన్ల కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఉండాలంటే అన్నింటిపై కనీస అవగాహన ఉండాలంటూ కౌంటర్లు వెస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడి పరిస్థితులు, నాయకుల గురించి తెలుసుకోవాలి అని సూచిస్తున్నారు. మొన్న తమ్మినేని వీరభద్రం చేసిన అవమానం మరిచిపోయావా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ముందు వెళ్లి రాజకీయాలు నేర్చుకో.. ఆ తర్వాత ప్రజల మధ్యకు రా తల్లీ అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అందుకే చెప్పేది.. నువ్వు తెలంగాణ నాయకురాలివి కావు.. నీకు తెలంగాణ రాజకీయాలు తెలియవు.. ఇక్కడి నాయకులు తెలియదు.. వెళ్లు ఏపీకి అంటూ సోషల్ మీడియాలో షర్మిలను ఏకిపారేస్తున్నారు.
తాజావార్తలు
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
-
Dragon Glimpse Review: ప్రశాంత్ నీల్ ఊరమాస్ ఎలివేషన్స్ ఓకే.. కానీ ఎన్టీఆర్ లుక్కే అలా ఉందేంటి? ‘డ్రాగన్’ గ్లింప్స్ రివ్యూ!
-
Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్కు జాక్పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?