YS Jagan: నేడు రెంటపాళ్లకి వైఎస్ జగన్.. పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ!
- నేడు రెంటపాళ్లకి వైఎస్ జగన్
- కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
- నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత, ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహా ఆవిష్కరణ అనంతరం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు.
వైఎస్ జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 11 గంటలకు రెంటపాళ్లకు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు జగన్ రెంటపాళ్ల నుంచి బయలుదేరి.. 1.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Also Read
- Ind Vs Afg: టాప్ ఆర్డర్ను నలిపేసిన ప్రసిద్ధ్.. వన్డేల్లో బెస్ట్ స్పెల్తో రికార్డు..
- NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..
- Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
- Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
Also Read: ENG vs IND: బుమ్రా ఆడొద్దని ఇంగ్లండ్ టీమ్ కోరుకుంటోంది.. బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించారు. జగన్ వెంట కేవలం 3 వాహనాలు, 100 మంది వ్యక్తులకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు. పోలీసుల ఆంక్షల మధ్య సత్తెనపల్లి పర్యటనకు జగన్ సిద్ధమయ్యారు. జగన్ పర్యటనకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. దాంతో ఈ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పల్నాడు జిల్లాలో పలువురు నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆంక్షల నేపథ్యంలో జన సమీకరణపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసుల నిఘాలో రెంటపాళ్ల ఉంది. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వెళ్లేదారిలో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. రాజుపాలెం మండలం కొండమోడు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించనున్నారు.
- Tags
- ap
- palnadu
- Rentapalla
- ycp
- ys jagan
తాజావార్తలు
-
Actress Rohini: రఘువరన్ నన్ను హౌస్వైఫ్గా ఉండమన్నాడు.. అందుకే సినిమాలకు దూరమయ్యాను: నటి రోహిణి
-
Ind Vs Afg: టాప్ ఆర్డర్ను నలిపేసిన ప్రసిద్ధ్.. వన్డేల్లో బెస్ట్ స్పెల్తో రికార్డు..
-
AA23 Update: అల్లు అర్జున్ కోసం లోకేష్ కనగరాజ్ స్పెషల్ ప్లాన్.. జూన్ 25న..!
-
NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..
-
Ma Inti Bangaram OTT Update : ‘మా ఇంటి బంగారం’ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!