YCP: వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలు ఔట్!
- వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
- హిందూపురంలో ఇద్దరు కీలక నేతలు ఔట్
- చాలా ఏళ్లుగా వైసీపీలో కొనసాగుతున్న ఇద్దరు నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan suspends Hindupur ycp leaders: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో.. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఇద్దరు వైసీపీ కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అధిష్టానం హెచ్చరించింది. వైసీపీలో ఈ కీలక పరిణామం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది.
కొండూరు వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిశ్చల్ చాలా ఏళ్లుగా వైసీపీలో కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భావం సమయంలో హిందూపురం తొలి వైసీపీ ఇన్చార్జిగా వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. మరోవైపు హిందూపురంలో నవీన్ నిశ్చల్ బలమైన నేతగా గుర్తింపు పొందారు. 2014లో నందమూరి బాలకృష్ణపై నవీన్ నిశ్చల్ పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో బాలకృష్ణపై వైసీపీ నుంచి కొండూరి దీపిక పోటీ చేసి ఓడారు. దీపికకు వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిశ్చల్ అండగా నిలబడ్డారు.
Also Read
Also Read: Crime News: వ్యభిచారానికి అంగీకరించలేదని.. ప్రియురాలిని పొడిచి చంపిన ప్రియుడు!
అయితే 2029 ఎన్నికల్లో హిందూపురం వైసీపీ అభ్యర్థిగా తనకే టికెట్ వస్తుందని నవీన్ నిశ్చల్ ఇటీవల ఓ కార్యక్రమంలో బహిరంగ ప్రకటన చేశారు. నవీన్ బహిరంగ ప్రకటనతో దీపిక వర్గం అసంతృప్తి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం హిందూపురం వైసీపీ ఇంఛార్జిగా ఉన్న దీపిక ఫిర్యాదుతోనే ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇద్దరు కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేయడం ఇప్పడు హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!