Crime News: వ్యభిచారానికి అంగీకరించలేదని.. ప్రియురాలిని పొడిచి చంపిన ప్రియుడు!
- రాజోలు మండలంలో దారుణం
- ప్రియురాలిని పొడిచి చంపిన ప్రియుడు
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Killed by Lover for Refusing Prostitution in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు వ్యభిచారం చేయడానికి అంగీకరించలేదని కత్తితో పొడిచి చంపేశాడు ప్రియుడు. అడ్డు వచ్చిన ప్రియురాలి తల్లి, సోదరుడుని కూడా గాయపరిచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో యువతి కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
రాజోలు మండలం మెరకపాలెం గ్రామానికి చెందిన ఓలేటి పుష్ప (22)కు నాలుగేళ్ల క్రితం దగ్గర బంధువుతో వివాహం జరిగింది. వివాహం జరిగిన నాలుగు నెలలకే భర్తతో అంతర్గత వివాదాలతో విడిపోయింది. అనంతరం విజయవాడలో కారు ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న షేక్ షమ్మ (22)తో పరిచయం ఏర్పడింది. గత కొంతకాలంగా బి సావరం గ్రామం సిద్ధార్థ నగర్లో ఇల్లు అద్దెకి తీసుకొని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. షేక్ షమ్మ గంజాయి, చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. నిత్యం డబ్బుల కోసం పుష్పను వేధిస్తుండేవాడు.
Also Read
- Minister Parthasarathy: జగన్పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
- Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read: Virat Kohli: ‘కింగ్’ కోహ్లీ ఆల్టైమ్ రికార్డ్.. మరో ఆటగాడికి సాధ్యం కాదేమో?
చెడు వ్యసనాలకు అలవాటు పడిన షేక్ షమ్మ.. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. తనకు అర్జెంటుగా డబ్బులు కావాలని, వ్యభిచారం చేయడానికి తన వెంట రావాలని పుష్పను ఫోర్స్ చేశాడు. అందుకు పుష్ప నిరాకరించడంతో.. వెంట తెచ్చుకున్న చాకుతో పుష్ప ఎడమ రూముపై పొడిచాడు. ఆ సమయంలో అడ్డు వెళ్లిన పుష్ప సోదరుడు, తల్లిని కూడా గాయపరిచాడు. ఆపై అక్కడ నుండి షేక్ షమ్మ పరారయ్యాడు. తీవ్ర గాయంతో పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. పుష్ప మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రాజోలు మండలంలో కలకలం రేపుతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు.. క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ
-
Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
-
Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!