YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం పోతుంది.. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే!
- ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుంది
- మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే
- రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది
- ఏపీలో ఒక్కటే ప్రతిపక్ష పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తోందని, ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి ప్రజలను బాబు మోసం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని వైసీపీ అధినేత చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రెస్మీట్ నిర్వహించారు.
‘రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ రాజ్యాంగం నడుపుతున్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. చట్టాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఏపీలో ఒక్కటే ప్రతిపక్ష పార్టీ.. మిగతా ప్రధాన పార్టీలు టీడీపీతో అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలుకుతున్న ఏకైక పార్టీ వైసీపీ. ఏ వర్గానికి ఏ కష్టం వచ్చినా వైసీపీనే ముందుంటుంది. సూపర్ సిక్స్ హామీలు వదిలేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పార్టీ వైసీపీనే. ప్రజలకు సంఘీభావంగా గొంతు కలపటం, అండగా నిలబడటం చేస్తుంది వైసీపీ. గత ఏడాది కాలంగా ప్రజలను అన్నీ రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రైతన్నల గిట్టుబాటు ధరల కోసం వారికి అండగా నిలిచాం. 2024 డిసెంబర్ 13వ తేదీన అన్నదాతకు అండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. డిసెంబర్ 24న కరెంట్ ఛార్జీల బాదుడుపై పోరుబాట నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. విద్యార్ధుల ఇబ్బందులను ప్రశ్నించేందుకు మార్చి 12న యువత పోరు పేరిట వారికి అండగా నిలదీసాం. జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా చంద్రబాబు ఎగ్గొట్టిన హామీలపై గట్టిగా నిలదీసాం. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం చేశాం. ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమం చేస్తున్నాం’అని వైఎస్ జగన్ తెలిపారు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
Also Read: Vegetable Price: అర్థ సెంచరీకి దగ్గరలో కూరగాయల ధరలు.. సెంచరీకి చేరువలో ఇంగ్లిష్ వెజిటేబుల్స్!
‘బాబు ష్యూరిటీ అంటూ ప్రజలకు కూటమి పార్టీలు ఇచ్చిన బాండ్లపై వారి మోసాలు ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజలను చైతన్య వంతులను చేసేలా కార్యక్రమాలు. గతంలో వారిచ్చిన బాండ్లు, చంద్రబాబు ఒక్కొక్కరికీ ఎంత బాకీ ఉన్నాడనే విషయం తెలియజేసే కార్యక్రమం. మేము చేసే ప్రతీ కార్యక్రమంలో ప్రజా ప్రయోజనం కనిపిస్తుంది. మేము లేవనెత్తిన ప్రతీ అంశం ప్రజా శ్రేయస్సు కోసమే. రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా చంద్రబాబు దగ్గరకు వెళ్ళటం లేదు, వైసీపీ తలుపు తడుతున్నారు. ఇది చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ప్రజల గొంతును నొక్కివేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో మూడేళ్లు ఆగితే తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మన సమస్యలు తీరతాయని ప్రజలు ఆలోచిస్తున్నారు’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..