YS Jagan: చంద్రబాబు కాలేజ్ రోజులను గుర్తుపెట్టుకుని.. ఇప్పుడు పగ తీర్చుకుంటున్నారు!
- తప్పుడు సాంప్రదాయంలో చంద్రబాబు కేసులు పెడుతున్నారు
- అందరికీ వడ్డీతో సహా లెక్కలు కడతాం
- తప్పులు తెలుసుకో.. పద్దతి మార్చుకో చంద్రబాబు
- సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకువస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Accuses CM Chandrababu of Revenge Politics: కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పుతో కొట్టారని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కాలేజ్ రోజుల్లో అందరూ ఉడుకు రక్తం మీద ఉంటారని, అది గుర్తు పెట్టుకుని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టారని, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలిచారని ఇదంతా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులందరి మీద తప్పుడు కేసులే అని పేర్కొన్నారు. ఒక తప్పుడు సాంప్రదాయంలో చంద్రబాబు కేసులు పెడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. నెల్లూరు పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
‘ఇంత విచ్చవిడిగా అవినీతి జరుగుతున్నా ఎవరూ మాట్లాడకూడదు. వీళ్లకు నచ్చిన వాళ్లు ఉంటే 99 పైసలకు భూములు ఇచ్చేస్తారు. ప్రతీదీ మోసం అని తేలిపోయింది. ఏ మనిషి సంతోషంగా లేరని తేలిపోయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైళ్లో పెట్టారు. నందిగాం సురేష్, జోగి రమేష్ కొడుకును జైళ్లో పెట్టారు. ఎంపీ మిథున్ రెడ్డిని జైళ్లో పెట్టారు. కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును చెప్పుతో కొట్టారని గుర్తు పెట్టుకున్నారు. కాలేజ్ రోజుల్లో అందరూ ఉడుకు రక్తం మీద ఉంటారు. అది గుర్తు పెట్టుకుని ఆయన కొడుకు జైల్లో పెట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారని చెవిరెడ్డిని జైల్లో పెట్టారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలిచారని ఇదంతా చేశారు. భాస్కర్ను వేధించి వేధించి జైళ్లో పెట్టారు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ను దొంగ కేసుల్లో పెడదామని చూస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు.. దేవినేని అవినాష్, తలశిల రఘురాం, అంబటి రాంబాబు, చంద్రశేఖర్ ఇలా చెప్పుకుంటూ పోతే అందరి మీదా కేసులే’ అని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
Also Read: Oval Test: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ తుది జట్టులో మూడు మార్పులు! మళ్లీ వచ్చేశాడు బాబోయ్
‘నాయకులందరి మీద తప్పుడు కేసులే. ఇవి కాక నాయకుల మీద, కార్యకర్తల మీద వేల సంఖ్యలో కేసులు. ఒక తప్పుడు సాంప్రదాయంలో చంద్రబాబు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మీరు విత్తిన విత్తనాలు చెట్లవుతాయి. అందరికీ వడ్డీతో సహా లెక్కలు కడతాం. మూడేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. అందరి లెక్కలు సరిచేస్తాం. తప్పులు తెలుసుకో.. పద్దతి మార్చుకో చంద్రబాబు. లేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత. అధికారులకు కూడా చెప్తున్నాం. మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకువస్తాం. ప్రతీ ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నాం’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..