CM Jaganmohan Reddy: రేపు జగనన్న తోడు.. చిరు వ్యాపారులకు ఆర్థిక ఆసరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మరో పథకానికి సంబంధించి ఆర్థిక చేయూతకు రంగం సిద్ధం అవుతోంది. జగనన్న తోడు – చిరు వ్యాపారుల ఉపాధికి ప్రభుత్వం ఆర్ధిక చేయూత పథకంలో భాగంగా బుధవారం సీఎం జగన్ (Jagan mohan reddy)ప్రారంభిస్తారు. చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించనున్నారు.
గత ఆరు నెలలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీ రీఇంబర్స్మెంట్ను రేపు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. పూర్తి వడ్డీ భారం భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేల ఆర్ధిక సహాయం అందిస్తుంది ప్రభుత్వం. రేపు 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ది చేకూరుతుంది. ఇప్పటి వరకు 15,03,558 లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 2,011 కోట్లుగా ప్రభుత్వం తెలిపింది. పల్లెల్లో, పట్టణాల్లో వీధి వ్యాపారాలు చేస్తూ సేవలందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకాన్ని 2020లోనే జగన్ ప్రారంభించారు. మిగతా పథకాల లాగే ఈ పథకం కూడా నిరాటంకంగా కొనసాగుతోంది.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
జగన్ పాదయాత్ర సమయంలో వీధి వ్యాపారాలు చేసుకునే వారిని చూసి, వారి కష్టాలకు చలించి కదిలిపోయారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఆర్థిక చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకున్నారు సీఎం జగన్. ఏటా క్రమం తప్పుకుండా వారికి 10 వేల రూపాయలు అందిస్తున్నారు. వీధి వ్యాపారులు తమ వ్యాపారానికి కావల్సిన పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడుతుంటారు.
రుణాలు దొరకకపోవడంతో ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చుకొని వ్యాపారాలు చేస్తూ అదనపు భారం మోస్తుంటారు. ఈ బాధల నుంచి విముక్తి కల్పిస్తానని ఇచ్చిన హామీని మూడో ఏడాది కూడా అమలు చేస్తున్నారు. వీధి వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం బ్యాంకుల నుండి లోన్లు ఇప్పించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా.. అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను వారి వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. జగన్ చేపట్టిన ఈ పథకం తమకు ఎంతగానే ఉపయోగపడుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!