Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ys Jagan Meets Vallabhaneni Vamsi In Vijayawada Sub Jail

YS Jagan: వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టారు.. పట్టాభిని సీఎం పంపించి గొడవ సృష్టించారు!

NTV Telugu Twitter
Published Date :February 18, 2025 , 1:20 pm
By Sampath Kumar
  • ములాఖత్‌లో వల్లభనేని వంశీని కలిసిన వైఎస్‌ జగన్‌
  • కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా వంశీ
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దిగజారిపోయింది
YS Jagan: వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టారు.. పట్టాభిని సీఎం పంపించి గొడవ సృష్టించారు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ములాఖత్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో జగన్‌ ములాఖత్ అయ్యారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, సింహాద్రి రమేష్ జైలు లోపలికి వెళ్లారు. ములాఖత్‌లో వంశీని పరామర్శించడానికి కొడాలి నాని,పేర్ని నాని పేర్లు కూడా వైసీపీ నేతలు ఇచ్చారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ ఇద్దరికీ అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు చెప్పారు. విజయవాడ జైల్లో కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

వల్లభనేని వంశీతో ములాఖత్‌ అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దిగజారిపోయింది. అతి దారుణంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే వ్యక్తి ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పాడు. జడ్జి ముందే తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు, వంశీకి సంబంధం లేదని చెప్పాడు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పట్టాభితో సీఎం చంద్రబాబు బూతులు తిట్టించారు. ఎవరేం పీకుతారో చూస్తానంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. వైసీపీ శ్రేణులు సంయమనంగానే వ్యవహరించారు. పట్టాభి మనుషులు ఓ దళిత సర్పంచ్ పై దాడి చేశారు. దాడి ఘటనలో సీఐ కనకారావుకు కూడా గాయాలు అయ్యాయి. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు పెట్టారు. మేము అధికారంలో ఉన్నా.. న్యాయబద్దంగానే వ్యవహరించాం’ అని అన్నారు.

‘వంశీ ఘటనలో లేదు కాబట్టి ఎక్కడా ఆయన పేరు లేదు. పోలీసులు కావాలని ఆయన పేరును ఇరికించటం కోసం దళిత యువకుడు సత్యవర్ధన్‌తో అతనికి సంబంధం లేకుండా కేసు పెట్టారు. ఘటనా స్థలంలో వంశీ లేడు కాబట్టి ఆయన పేరు ఎవరూ చెప్పలేదు. సత్యవర్ధన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో తనను ఎవరు తిట్టలేదని చెప్పాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసు రీ ఓపెన్ చేశారు. ఇదే సత్యవర్ధన్‌తో రెండవసారి 161 స్టేట్మెంట్ తీసుకున్నారు. వంశీ మీద ఉన్న ఆక్రోశంతో సీఎం చంద్రబాబు కేసు పెట్టించారు. వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా 71వ నిందితుడిగా చేర్చారు. టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారని మరో ఫాల్స్ కేసు పెట్టించారు. టీడీపీ కార్యాలయం కూడా ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు సంబంధించినదని మరో తప్పుడు కేసు పెట్టారు. చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదని అట్రాసిటీ కేసులు పెట్టించారు. మరో 44 మంది వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. సత్యవర్ధన్ మెజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇస్తే మిగతా వాళ్లకు బెయిల్ వస్తుందని ఆలస్యం చేశారు. సత్యవర్ధన్ జడ్జ్ ముందు ఘటన జరిగిన సమయంలో తాను లేను, తనను ఎవరూ తిట్టలేదని మొర పెట్టుకున్నాడు. చంద్రబాబాబు, లోకేష్ కు వంశీని అరెస్ట్ చేయలేకపోతున్నామని ఆక్రోశం వెళ్లగక్కారు. మళ్ళీ కోర్టును తప్పుదోవ పట్టించారని మరో కేసు పెట్టించారు. సత్యవర్ధన్ అమ్మ, నాన్న, సోదరుడిని బెదిరించి తప్పుడు కేసు పెట్టించారు. కిడ్నాప్, బెదిరింపు అంటూ ఆ కేసు పెట్టారు’ అని జగన్ మండిపడ్డారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • tdp
  • Vallabhaneni Vamsi
  • Vijayawada Sub Jail
  • ycp
  • ys jagan

తాజావార్తలు

  • Shruthi Haasan : చీరకట్టులో శృతిహాసన్ నిండైన అందం..

  • IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ కు ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో తడబడిన పంజాబ్

  • Congress Committees: తెలంగాణలో కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం..

  • Kamal Haasan : వైజాగ్ ప్రజల రుణం తీర్చుకుంటా.. కమల్ హాసన్ కామెంట్స్..

  • Security Drills: సరిహద్దు రాష్ట్రాల్లో డ్రిల్స్ వాయిదా? మళ్లీ ఎప్పుడంటే..!

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions