Komali Suicide Case: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో ఈ ఘటన జరిగింది. అయితే.. కోమలి అఖిల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. పలు కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమైంది. అయితే.. తాజాగా అఖిల్ రాయదుర్గం పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. దీంతో కోమలి స్నేహితులు వీడే కారణం అంటూ విరుచుకుపడ్డారు. కోమలి సూసైడ్ లెటర్ లో కూడా అఖిల్ పేరు ఉందని స్నేహితులు తెలిపారు. ఈ అంశంపై తాజాగా రాయదుర్గం సీఐ వెంకన్న మాట్లాడారు. “నిన్న ఉదయం మాకు కాల్ వచ్చింది. చిత్రపురి కాలనీలో వెళ్లి చూశాం.. ఒక ఫ్లాట్ లో కోమలి అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. చిత్రపురి కాలనీలోనే ఉండే.. అఖిల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఆత్మహత్యకి అఖిల్ కారణం అని కోమలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.. దర్యాప్తు చేస్తున్నాం.. అఖిల్ కూడా మా ముందు వచ్చి హాజరయ్యాడు. కోమలి ప్రేమలో ఉన్నమాట వాస్తవమే కానీ.. విడిపోయాం అని చెప్తున్నాడు.. నేను వేరే యువతితో రిలేషన్లో ఉన్నాను. నన్ను వదిలేయ్ అని కోమలికి చెప్పాను.. కానీ తను వినకుండా ఇబ్బంది పెట్టింది అని అఖిల్ చెప్తున్నాడు. అఖిల్, కోమలి వ్యవహారం తల్లికి తెలుసు.. ఏడాది క్రితం తల్లి సమక్షంలోనే వీరిద్దరూ మాట్లాడుకున్నారు.. ఆత్మహత్యకి ముందు కోమలి తల్లికి మెసేజ్ చేసింది. ఐ లవ్ యూ మమ్మీ.. తమ్ముడిని బాగా చూసుకో జాగ్రత్త అని మెసేజ్ చేసింది.” అని సీఐ వెల్లడించారు.
READ MORE: Minister Nara Lokesh: VSR ఏవియేషన్స్తో ఎలాంటి లావాదేవీలు లేవు.. ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు
కోమలి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోని ఓ మహిళ కోమలి మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. “కోమలి మాకు తెలుసు. ఆ అమ్మాయి చాలా మంచిది. ఫ్రెండ్లీగా ఉండేది. అందరితో కలిసి ఉండేది. మా పిల్లలతో చాలా బాగా కలిసి పోయేది. మాతో ఫైనాన్షియల్, లవ్ ప్రాబ్లమ్ ఉన్నట్టు ఏ విషయాన్ని షేర్ చేసుకోలేదు. ఎవరో మోసం చేస్తే బాధ పడుతున్నట్లు కూడా ఎప్పుడూ కనిపించేది కాదు.. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండేది. కానీ ఏం జరిగింది? అనేది మాకు తెలియదు. సంక్రాతికి ముందు మేము టూర్కి వెళ్లాలనుకున్నాము. అరుణాచలం, తిరుపతి తిరగాలనుకున్నాం. తాను కూడా వస్తానంది. మేము వెళ్లే రోజు నైట్ మా ఇంటికి వచ్చింది. అదే లాస్ట్ నేను చూసింది.” అని వివరించారు.
