Rahul Gandhi: 19న రాహుల్ గాంధీ బర్త్డే.. యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
- జూన్ 19న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు
- 'మహా రోజ్గర్ మేళా' నిర్వహిస్తున్న యూత్ కాంగ్రెస్
- జాబ్ మేళాకు హాజరు కానున్న 100కి పైగా కంపెనీలు
- ఇప్పటికే 20 వేలకు పైగా ఆన్లైన్, ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 19న కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘మహా రోజ్గర్ మేళా’ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో 100 కి పైగా కంపెనీలు యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇప్పటివరకు 20 వేలకు పైగా ఆన్లైన్, ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ కార్యక్రమం జూన్ 19 న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరుగుతుంది. తాజాగా యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, యూత్ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త యాజ్ఞవాల్క్య శ్రీకాంత్ జిచ్కర్, ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్షయ్ లక్రా, ఢిల్లీ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఖుష్బూ శర్మ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జాబ్ మేళా పోస్టర్ను విడుదల చేశారు.
READ MORE: KTR Sends Legal Notice: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ కల్పించలేదని యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ విమర్శించారు. రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యను ప్రముఖంగా లేవనెత్తారన్నారు. జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా యువజన కాంగ్రెస్ ఉద్యోగ మేళా నిర్వహించాలని నిర్ణయించిందని అన్నారు.100 కి పైగా కంపెనీలను ఆహ్వానించామని, ఇవి యువతను ఇంటర్వ్యూ చేసి వారికి ఉద్యోగాలు కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా నిరుద్యోగులుగా ఉన్న వేలాది మంది ఢిల్లీ యువత ఈ ఉద్యోగ మేళా ద్వారా ప్రయోజనం పొందుతారన్నారు. ఇప్పటికే 20 వేలకు పైగా ఆన్లైన్, ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించారు. జూన్ 19న జాబ్ మేళాతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా రక్తదాన శిబిరాలు, కుల గణనపై సెమినార్లు నిర్వహిస్తున్నట్లు చిబ్ చెప్పారు.
READ MORE: Israel Iran War: అమెరికా నుంచి 14,000 కిలోల “బంకర్ బస్టర్” బాంబు కోరుతున్న ఇజ్రాయిల్..
Tags:
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!