Rahul Gandhi: 19న రాహుల్ గాంధీ బర్త్డే.. యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
- జూన్ 19న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు
- 'మహా రోజ్గర్ మేళా' నిర్వహిస్తున్న యూత్ కాంగ్రెస్
- జాబ్ మేళాకు హాజరు కానున్న 100కి పైగా కంపెనీలు
- ఇప్పటికే 20 వేలకు పైగా ఆన్లైన్, ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 19న కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘మహా రోజ్గర్ మేళా’ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో 100 కి పైగా కంపెనీలు యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇప్పటివరకు 20 వేలకు పైగా ఆన్లైన్, ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ కార్యక్రమం జూన్ 19 న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరుగుతుంది. తాజాగా యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, యూత్ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త యాజ్ఞవాల్క్య శ్రీకాంత్ జిచ్కర్, ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్షయ్ లక్రా, ఢిల్లీ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఖుష్బూ శర్మ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జాబ్ మేళా పోస్టర్ను విడుదల చేశారు.
READ MORE: KTR Sends Legal Notice: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
Also Read
- 8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ కల్పించలేదని యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ విమర్శించారు. రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యను ప్రముఖంగా లేవనెత్తారన్నారు. జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా యువజన కాంగ్రెస్ ఉద్యోగ మేళా నిర్వహించాలని నిర్ణయించిందని అన్నారు.100 కి పైగా కంపెనీలను ఆహ్వానించామని, ఇవి యువతను ఇంటర్వ్యూ చేసి వారికి ఉద్యోగాలు కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా నిరుద్యోగులుగా ఉన్న వేలాది మంది ఢిల్లీ యువత ఈ ఉద్యోగ మేళా ద్వారా ప్రయోజనం పొందుతారన్నారు. ఇప్పటికే 20 వేలకు పైగా ఆన్లైన్, ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించారు. జూన్ 19న జాబ్ మేళాతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా రక్తదాన శిబిరాలు, కుల గణనపై సెమినార్లు నిర్వహిస్తున్నట్లు చిబ్ చెప్పారు.
READ MORE: Israel Iran War: అమెరికా నుంచి 14,000 కిలోల “బంకర్ బస్టర్” బాంబు కోరుతున్న ఇజ్రాయిల్..
Tags:
తాజావార్తలు
-
Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
-
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్కు చావోరేవో.. ప్లేఆఫ్స్కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!