Secunderabad Railway Station: హనీమూన్ కి బయలుదేరిన యువకుడు.. వాటర్ బాటిల్ కోసం ట్రైన్ దిగి.. చివరకు
- హనీమూన్ కి బయలుదేరిన యువకుడు
- వాటర్ బాటిల్ కోసం ట్రైన్ దిగి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. హనీ మూన్ కి బయలుదేరిన యువకుడు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడి రైల్ కు ప్లాట్ ఫారంకు మధ్య ఇరుక్కొని తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు వరంగల్ కు చెందిన ఉరకొండ సాయి (28) గా పోలీసులు గుర్తించారు. సాయికి మూడు నెలల క్రితం వివాహం జరిగినట్లు తెలిపారు.
Also Read:Double Murder Case: అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్..? డబుల్ మర్డర్ కేసులో పోలీసుల గాలింపు..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
హనీమూన్ కు గోవాకు వెళ్ళడం కోసం తన భార్య, బావమరిది, 4స్నేహితులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వస్కోడిగామ ఎక్స్ ప్రెస్ రైల్ ఎక్కారు. రైలు కదలడంలో ఆలస్యం అవుతుండడంతో వాటర్ బాటిల్ కోసం సాయి కిందకు దిగాడు. సాయి తిరిగి వచ్చే లోపు ట్రైన్ కదలడంతో అందులో ఉన్న అతడి స్నేహితులు చైన్ లాగి రైలును ఆపారు. చైన్ లాగిన ఇద్దరు యువకులను కిందకు దింపి ప్రశ్నించిన రైల్వే పోలీసులు జరిమానా కట్టాలన్నారు.
Also Read:Bajaj 125cc Bike: బజాజ్ కొత్త 125cc బైక్.. విడుదలయ్యేది అప్పుడే!
జరిమానా కడతామని, తమను వదిలి పెట్టాలని స్నేహితులతో పాటు సాయి పోలీసులను ప్రాధేయ పడ్డాడు. ఈ లోపు రైలు కదలడం అందులోనే తన భార్య, బావమరిది ఉండడంతో పరిగెత్తి సాయి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. అదుపుతప్పి కిందపడి రైల్ కు, ప్లాట్ ఫారం కు మద్యలో ఇరుక్కొని తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. సాయి మృతికి రైల్వే పోలీసులే కారణమని స్నేహితులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తగిన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!