Tamilnadu : కాలేజీ ఫీజు కడతామన్నారు.. గదిలో బంధించి అత్యాచారం చేశారు
Tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. కాలేజీ ఫీజు కట్టి ఆదుకుంటామని నమ్మించి ఓ యువతిపై ఇద్దరు యువకులు దారుణంగా అత్యాచారం చేశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెను మూడు రోజుల పాటు హోటల్ గదిలో బంధించి దారుణంగా రేప్ చేశారు. వారి నుంచి అతికష్టం మీద తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారిద్దరిపై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లాకు చెందిన 20 ఏళ్ల స్టూడెంట్ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకెండియర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు కొంత కాలం కిందట విడిపోయారు. అయితే కాలేజీలో ఫీజు కట్టాల్సి రావడంతో యువతి తన తల్లిని అడిగింది. తాను ఫీజు కట్టబోనని, తండ్రిని అడగాలని ఆమె సూచించింది. దీంతో ఆ యువతి తన తండ్రిని అడిగింది. అతడు కూడా ఫీజు కట్టేందుకు నిరాకరించాడు.
Also Read
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
Read Also: AdiReddy Apparao: ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లకు మే 12 వరకు రిమాండ్
బాధతో తన పరిస్థితి గురించి తన కాలేజీ స్నేహితుడికి విషయం చెప్పింది. సాయం చేయాలని కోరింది. అతడి ద్వారా ఆమెకు కోయంబత్తూరు జిల్లా కొండయంపాళయంకు చెందిన జర్మన్ రాజేష్, పి రవీంద్రన్ పరిచయం అయ్యారు. వాళ్లు తనకు కాలేజీ ఫీజు కడతామని హామీ ఇచ్చారు. దీంతో ఆ యువతి వారిని నమ్మింది. ఆమెను ఏప్రిల్ 23న ఇద్దరు నిందితులు ఓ హోటల్ కు తీసుకెళ్లి బంధించారు. మూడు రోజులు పాటు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమెను బెదిరించారు. అయితే వారి బారి నుంచి యువతి తప్పించుకుంది.
ఏప్రిల్ 26న మహిళా పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వారికి వివరించింది. నిందితులపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు హోటల్ కు వెళ్లి చూడగా..వారు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. తరువాత వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఓ ప్రదేశంలో పోలీసులు వారిని కనిపెట్టారు. దీంతో నిందితులు భయపడిపోయి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ భవనంపై నుంచి దూకడంతో వారి కాళ్లకు గాయాలు అయ్యాయి. నిందితులిద్దరినీ కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (సీఎంసీహెచ్)లో చేర్చారు. శుక్రవారం వీరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో.. పోలీసులు వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Read Also:ROHIT SHARMA : రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్.. తొండాట ఆడిన సంజూ శాంసన్
తాజావార్తలు
-
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
-
Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!