Tamilnadu : కాలేజీ ఫీజు కడతామన్నారు.. గదిలో బంధించి అత్యాచారం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. కాలేజీ ఫీజు కట్టి ఆదుకుంటామని నమ్మించి ఓ యువతిపై ఇద్దరు యువకులు దారుణంగా అత్యాచారం చేశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెను మూడు రోజుల పాటు హోటల్ గదిలో బంధించి దారుణంగా రేప్ చేశారు. వారి నుంచి అతికష్టం మీద తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారిద్దరిపై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లాకు చెందిన 20 ఏళ్ల స్టూడెంట్ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకెండియర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు కొంత కాలం కిందట విడిపోయారు. అయితే కాలేజీలో ఫీజు కట్టాల్సి రావడంతో యువతి తన తల్లిని అడిగింది. తాను ఫీజు కట్టబోనని, తండ్రిని అడగాలని ఆమె సూచించింది. దీంతో ఆ యువతి తన తండ్రిని అడిగింది. అతడు కూడా ఫీజు కట్టేందుకు నిరాకరించాడు.
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
Read Also: AdiReddy Apparao: ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లకు మే 12 వరకు రిమాండ్
బాధతో తన పరిస్థితి గురించి తన కాలేజీ స్నేహితుడికి విషయం చెప్పింది. సాయం చేయాలని కోరింది. అతడి ద్వారా ఆమెకు కోయంబత్తూరు జిల్లా కొండయంపాళయంకు చెందిన జర్మన్ రాజేష్, పి రవీంద్రన్ పరిచయం అయ్యారు. వాళ్లు తనకు కాలేజీ ఫీజు కడతామని హామీ ఇచ్చారు. దీంతో ఆ యువతి వారిని నమ్మింది. ఆమెను ఏప్రిల్ 23న ఇద్దరు నిందితులు ఓ హోటల్ కు తీసుకెళ్లి బంధించారు. మూడు రోజులు పాటు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమెను బెదిరించారు. అయితే వారి బారి నుంచి యువతి తప్పించుకుంది.
ఏప్రిల్ 26న మహిళా పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వారికి వివరించింది. నిందితులపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు హోటల్ కు వెళ్లి చూడగా..వారు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. తరువాత వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఓ ప్రదేశంలో పోలీసులు వారిని కనిపెట్టారు. దీంతో నిందితులు భయపడిపోయి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ భవనంపై నుంచి దూకడంతో వారి కాళ్లకు గాయాలు అయ్యాయి. నిందితులిద్దరినీ కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (సీఎంసీహెచ్)లో చేర్చారు. శుక్రవారం వీరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో.. పోలీసులు వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Read Also:ROHIT SHARMA : రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్.. తొండాట ఆడిన సంజూ శాంసన్
తాజావార్తలు
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!