Yes Bank : ఒకప్పుడు దివాళా స్థితిలో ఉన్న బ్యాంక్ ప్రస్తుతం జనాలను ధనవంతులను చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yes Bank : ఒకప్పుడు పతనావస్థలో ఉన్న యెస్ బ్యాంక్ మరోసారి వృద్ధి దిశగా పయనిస్తూ ప్రజలను సంపన్నులను చేస్తోంది. యెస్ బ్యాంక్ షేర్లలో భారీ పెరుగుదల నమోదవుతుంది. వారంలోని ట్రేడింగ్ నాల్గవ రోజున యెస్ బ్యాంక్ షేర్లు పెరుగుదలతో ప్రారంభమయ్యాయి. యెస్ బ్యాంక్ షేర్లు గురువారం 8 శాతానికి పైగా పెరిగి రూ.32.74కి చేరాయి. గత మూడు రోజుల్లో యెస్ బ్యాంక్ షేర్లు 40శాతానికి పైగా పెరిగాయి. యెస్ బ్యాంక్ షేర్లు రూ.45 వరకు వెళ్లవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు, యెస్ బ్యాంక్ షేర్లు కూడా గురువారం 52 వారాల కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. బ్యాంక్ షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.14.10.
Read Also:PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రధాని మోడీ ప్రశంసలు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
అయితే, ట్రేడింగ్ సెషన్లో కొంత సమయం తర్వాత దాని షేర్ పడిపోవడం ప్రారంభమైంది. మూడు శాతం పెరుగుదలతో 30.70 పైసల వద్ద ట్రేడవుతోంది. దీనితో పాటు ఒక సంవత్సరంలో ఈ బ్యాంకింగ్ స్టాక్ పనితీరును పరిశీలిస్తే.. ఈ కాలంలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన మొత్తం దాదాపు రెండింతలు పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటాను కొనుగోలు చేయడానికి సంతకం చేసిన తర్వాత యెస్ బ్యాంక్ షేర్లలో ఇటీవలి పెరుగుదల కనిపించింది. యెస్ బ్యాంక్లో వాటా కొనుగోలుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకోవడం.. సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 9.5 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. అప్పటి నుంచి కంపెనీ షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.
Read Also:AP Assembly budget Session: అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. బహిష్కరించిన టీడీపీ
షేర్లలో కొనసాగుతున్న పెరుగుదల మధ్య, యెస్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారీ జంప్ జరిగింది. దీని మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.80,000 కోట్లకు చేరుకుంది. యెస్ బ్యాంక్ షేర్లలో కొనసాగుతున్న ర్యాలీ గురించి మాట్లాడుతూ.. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యెస్ బ్యాంక్లో అదనపు వాటాను కొనుగోలు చేయడం దీర్ఘకాలిక ఔట్లుక్కు చాలా సానుకూలంగా ఉంది. దీనికి స్థిరత్వాన్ని అందజేస్తుందని వెల్త్మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బథిని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!