AP Assembly budget Session: అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. బహిష్కరించిన టీడీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి.. అయితే, అసెంబ్లీ సమావేశాల చివరి రోజును తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిష్కరించారు.. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వినాశక చట్టాలు చేసిందని.. ఆ ప్రతులను అసెంబ్లీ బయట తగలుబెట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మూడు రాజధానులు చట్టం, మద్యం అమ్మకాల తాకట్టు, మీడియాపై ఆంక్షలు వంటి జీవోలు దహనం చేశారు.. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రతులు, ఇతర ప్రజా వ్యతిరేక నిర్ణయాల ప్రతులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్ధం చేశారు. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ రోజు అంటూ నినాదాలు చేశారు. నేటితో రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం వదిలిపోయిందని నినదించారు టీడీపీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు.
Read Also: Kapu Ramachandra Reddy: నా భవిష్యత్తేంటో పైవాడే నిర్ణయిస్తాడు..
Also Read
- Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
- India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
ఇక, ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఐదేళ్ల శాసనసభ చీకటి సభే.. చివరి రోజు కూడా యాత్ర సినిమా కోసం సభను 2 గంటలు వాయిదా వేశారని విమర్శించారు.. ఇక, టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఐదేళ్ల శాసనసభలో ప్రతీ రోజూ బ్లాక్ డేనే అని విమర్శించారు. ప్రజల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం శాసనసభ లో మంటగలిసిందంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు.. ఆశా వర్కర్లపై లాఠీచార్జ్ చేయడం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు అచ్చెన్నాయుడు.. సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్ట్ చేసి నిర్బంధిస్తారా? ఐదేళ్లుగా ఆశాలతో జగన్ రెడ్డి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఆదాయ పరిమితి నిబంధనతో ఆశాలను సంక్షేమానికి దూరం చేశారు. సెలవులివ్వకుండా, పని భారంతో ఒత్తిడి పెంచడం అమానుషం కాదా? ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే నిరసన తెలిపడం నేరమెలా అవుతుంది? అని ప్రశ్నించారు. తక్షణమే ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. సకాలంలో వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.
తాజావార్తలు
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
-
India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
-
PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!