YS Viveka Case: సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కొంతకాలంగా బెయిల్పై బయట ఉన్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు. బెయిల్ రద్దు చేసిన హైకోర్టు.. సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి లొంగిపోయారు. లొంగిపోయిన గంగిరెడ్డి న్యాయస్థానం జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. వైఎస్ వివేకా హత్య కేసు అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం 2019 మార్చి 28న గంగిరెడ్డిని అరెస్టు చేసింది. ఆ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే నిర్దిష్ట వ్యవధిలో ఛార్జిషీట్ దాఖలు చేయడంలో సిట్ విఫలమైనందున..గంగిరెడ్డికి పులివెందులలోని స్థానిక కోర్టు 2019 జూన్ 27న డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ విచారణ చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసి.. ఈ కేసులో ఏర్ర గంగిరెడ్డిని ఏ-1 గా పేర్కొంది. ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది. అయితే సీబీఐ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.
Read Also: Bajrangdal protest: తెలంగాణకు తాకిన కర్ణాటక సెగ.. గాంధీ భవన్ వద్ద టెన్షన్
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది నవంబర్లో ఈ హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీంతో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎర్ర గంగిరెడ్డి సాక్షులకు బెదిరింపులు, విచారణకు ఆటంకం కలిగిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. మరోవైపు గంగిరెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి సీబీఐ వద్ద సాక్ష్యాధారాలు లేవని ఆయన తరఫు లాయర్ పేర్కొన్నారు. అయితే ఇరువైపుల వాదనల అనంతరం.. సీబీఐ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసింది. మే 5వ తేదీలోగా ఎర్రగంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోవాలని.. అలా కానీ పక్షంలో ఆయనను సీబీఐ అరెస్టు చేసేందుకు అనుమతించింది. ఈ క్రమంలోనే నేడు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వచ్చిన ఎర్ర గంగిరెడ్డి న్యాయవాదుల సమక్షంలో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!