Samajika Sadhikara Bus Yatra: జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాపట్లలో సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా అంబేద్కర్ సర్కిల్ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తాను అని లోకేష్ అన్నాడు.. జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు అని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి భయపడే టైపు కాదు.. దేశాన్ని శాసించిన సోనియాగాంధీని లెక్కచేయని మగాడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
Read Also: Constable Dismissed: వాహనాల తనిఖీ పేరుతో 18.50 లక్షలను కాజేసిన కానిస్టేబుల్
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంటే ప్రతిపక్షాలకు కడుపులో మండుతుంది అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఒకడు యూట్యూబ్ లో చూసి ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవచ్చు అంటాడు.. వాడి పిల్లలు యూట్యూబ్ చూస్తే నేర్చుకుంటున్నారా , వాడు యూట్యూబ్ చూసే సినిమాలు చేస్తున్నాడా?.. ప్రతిపక్షాలన్నీ ఏకమైన కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేవు జగన్మోహన్ రెడ్డి కటౌట్ పట్టుకొని ప్రజల్లోకి వెళతాం అని ఆయన వెల్లడించారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏ పార్టీ చేయని విధంగా బీసీలకు పెద్దపీట వేసిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి ఐదుగురిని రాజ్యసభకు పంపిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు.
Read Also: Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఏపీలో మూతపడ్డ ఆలయాలు..
ఇక, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ దళితులను జైళ్లకు పంపితే జగన్మోహన్ రెడ్డి దళితులను పార్లమెంటుకు పంపారు. పేద పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత జీవితాలు అనుభవించాలంటే 20 సంవత్సరాల పాటు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తీరాలి అని ఆయన అన్నారు. ఆదమరిస్తే ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మన పిల్లల జీవితాలు మన జీవితాలు తిరిగి వెనక్కు వెళ్లిపోతాయి.. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వారి అవకాశాల కోసం వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మన కోసం వచ్చారు పేద బడుగు బలహీన వర్గాల కోసం వచ్చారు అని ఎంపీ నందిగాం సురేష్ పేర్కొన్నారు. అంతు చూస్తా అన్నవాడు జైలుకు పోయాడు భయపెడతా అన్న కొడుకు భయపడి ఢిల్లీ పారిపోయి విగ్గురాజు దగ్గర దాక్కున్నాడు అంటూ ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!